న్యూఢిల్లీ : పండుగలు, శుభకార్యాల్లో నోరూరించే ఆహార పదార్ధాలను మోతాదుకి మించి తింటే కడుపుబ్బరం, అజీర్తి బాధిస్తుంటాయి. పరిమితికి మించి ఆమారం తీసుకుంటే కడుపునొప్పి, వికారం, మలబద్ధకం వంటి ఎన్నో సమస్యలు వెంటాడుతుంటాయి. ఆహారాన్ని మెల్లిగా తీసుకుంటూ బాగా నమిలి తినడం ద్వారా సులభంగా అరుగుతుందని, జీర్ణ సమస్యలు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు.
కూరగాయలు, ఆకుకూరలు అధికంగా తీసుకోవడంతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలను విధిగా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. తాజా పండ్లు, తృణధాన్యాలు, బాదం, జీడిపప్పు వంటి నట్స్ తీసుకోవడం ద్వారా తగినంత ఫైబర్ లభించడంతో జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఇవి జీర్ణక్రియకు సహకరించడంతో పాటు శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ సహా సూక్ష్మపోషకాలను అందిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహార పదార్దాలను తీసుకోవడంతో పాటు కడుపుబ్బరం తగ్గించేందుకు ఈ దిగువ ప్రస్తావించిన ఐదు టిప్స్ను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
భోజనం చేయగానే నడక
తగినంత నీరు తాగాలి
కడుపుపై మసాజ్
హాట్ వాటర్ గ్యాగ్ వాడాలి
పుదీనా టీ సేవించాలి