Summer | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ఎండాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యశాఖ సూచించింది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం, ఏటా మార్చి నుంచి మే మధ్య వడగాడ్పులు వీస్తున్న నేపథ్యంలో మార్గదర్శకాలు రూపొందించింది.
మున్సిపల్ కమిషనర్లకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ ఆదేశాలు
వేసవిలో నీటి కొరతతో సహా ఇతర సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్లను మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ ఆదేశించారు. ఈ వేసవిలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని వా తావరణశాఖ అధికారులు అంచనా వేసినట్టు చెప్పారు. మంగళవారం సీడీఎంఏ సత్యనారాయణతో కలిసి మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పశువులు, పక్షులు, జంతువులకు నీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.