ఎండాకాలం అంతా చల్లని నీళ్లు తాగేందుకు ఇష్టపడతారు. కొందరైతే డీప్ ఫ్రిజ్లో పెట్టిన బాటిల్స్ తీసి చిల్డ్ వాటర్ తాగుతుంటారు. ఎండలో తిరిగితిరిగి వచ్చి చల్లని నీళ్లు తాగితేనే దాహం తీరుతందనే భ్రమలో ఉంటారు. ఈ వేసవిలో ఎవరి ఇంటికెళ్లినా మొదట నీళ్లిస్తారు. కూల్ వాటర్ తాగుతారా? నార్మలా? అని అడుగుతారు. మీరు గనుక కూల్ వాటర్ అని అన్నారంటే మీరు ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లే అంటున్నారు వైద్య నిపుణులు. కూల్వాటర్ తాగడం వల్ల ఆరు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా?
1. జీర్ణక్రియ మందగిస్తుంది..
కూల్ వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీని గురించి డాక్టర్ అనిల్ మెహతా లైబ్రేట్.కామ్ ఉదాహరణపూరితంగా వివరించారు. మీరు ముఖాన్ని వేడి నీళ్లను కడుక్కుంటే చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. అదే మీరు ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కుంటే చర్మరంధ్రాలు మూసుకుపోతాయి. దీన్నే మీ జీర్ణవ్యవస్థకు అప్లై చేయండి. జీర్ణవ్యవస్థ అంటే కేవలం పొట్ట, పేగులు మాత్రమే కాదు.. మనం ఆహారం తీసుకున్నప్పటినుంచి జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. శరీరం నుంచి వ్యర్థాలు విసర్జించేదాకా జీర్ణవ్యవస్థ పనిచేస్తుంది. చల్లటి నీళ్లు తాగినప్పుడు ఈ ప్రక్రియ సరిగ్గా సాగదు. దీంతో జీర్ణసంబంధ సమస్యలు తలెత్తుతాయి.
2. హృదయస్పందనరేటు తగ్గిపోతుంది..
చల్లటి నీళ్లు తాగడం వల్ల హృదయ స్పందన రేటు తగ్గిపోతుంది. అలాగే, శరీరం అసంకల్పిత విధులను నియంత్రించే నాడిని ఇది ప్రేరేపిస్తుంది. దీనిని వేగస్ నాడి అంటారు. ఈ నాడి.. నాడీ వ్యవస్థలో అంతర్భాగం. ఐస్ వాటర్ తీసుకోవడం వల్ల ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఏర్పడి వేగస్నాడి చురుకుదనం తగ్గిపోతుంది. దీంతో హృదయ స్పందన రేటు తగ్గిపోతుందని ఓ తైవాన్ అధ్యయనం తేల్చింది.
3. మలబద్ధకానికి కారణమవుతుంది..
భోజనం చేసిన తర్వాత చల్లటి నీటిని తీసుకుంటే కొవ్వు విచ్ఛిన్నం అవుతుంది. శరీరంలోని చల్లని ఉష్ణోగ్రతల వల్ల కొవ్వులు గట్టిపడి ఘనీభవిస్తాయి, ఇవి మన శరీరం జీర్ణం చేసుకోవడం కష్టసాధ్యమవుతుంది. దీంతో మలబద్ధకం ఏర్పడుతుంది. అందుకే ఆయుర్వేద నిపుణులు ఆహారం తీసుకునే 30 నిమిషాల ముందు, 30 నిమిషాల తర్వాత నీళ్లు తాగొద్దని సూచిస్తారు. అలాగే, పేగుల్లోని పోషకాలు, నీటి శోషణ యంత్రాంగంలోని రంధ్రాలు కూడా చల్లని ఉద్దీపనలకు ప్రతిస్పందనగా సంకోచం చెందుతాయి. ఇది మలబద్ధకం ప్రధాన కారణాల్లో ఒకటి. గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ సాఫీగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు.
4.తలనొప్పి వస్తుంది..
ఎప్పుడైనా కొన్ని ఐస్ముక్కలను నుదిటిపై పెట్టుకుని చూడండి. ఎలా ఉంటుంది. తలలో జివ్వుమన్నట్లు ఉంటుంది కదా? కూల్ వాటర్ తాగడం వల్ల వెన్నెముకలోని సెన్సిటివ్ నరాలను చల్లబరుస్తుంది. అవి తక్షణమే మీ మెదడుకు సందేశాలను ప్రసారం చేస్తుంది. తద్వారా తలనొప్పికి కారణమవుతుంది. ఇది ముఖ, కపాల కండరాలను అకస్మాత్తుగా సంకోచించేలా చేయడమే కాకుండా, ఒక రకమైన థర్మల్ షాక్ను కలిగిస్తుంది.
5. అలర్జీకి కారణమవుతుంది..
ఇప్పటిదాకా మనం థర్మల్ షాక్ గురించి మాట్లాడుకున్నాం కదా.. అదే అలర్జీలకు కూడా కారణమవుతుంది. చల్లని నీళ్లు తాగినప్పుడు మన శరీర రక్షణాత్మక ప్రతిస్పందన దెబ్బతింటుంటి. 16 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు మన శరీరం కంఫర్డ్గా ఉంటుంది. అంతకు మించి తగ్గితే చల్లటి నీటిని తొలగించేందుకు మన శరీరం శ్లేష్మాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల సైనస్ వస్తుంది. అందుకే వేసవిలో చల్లని పదార్థాలు, కూల్డ్రింక్స్ తాగినప్పుడు కొందరిలో జలుబు, దగ్గులాంటి లక్షణాలు కనిపిస్తాయి.
6. బరువు పెరుగుతారు..
చల్లటినీళ్లు తాగడం వల్ల బరువు పెరుగుతారని ఆయుర్వేదం చెబుతోంది. అయితే, చల్లని నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతుందని జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం ప్రచురించింది. ఐస్ వాటర్ తాగడం వల్ల తక్కువకాలంలో కేలరీలు బర్న్ అవుతాయన్న మాట వాస్తవమేగానీ, దీర్ఘకాలంలో మాత్రం అది శరీరంలో అసమతుల్యతను సృష్టిస్తుందని కృపాలు. ఆర్గ్ కి చెంది డాక్టర్ వసంత్లాడ్ చెప్పారు. ఇది చివరకు బరువు పెరిగేందుకు కారణమవుతుందని వివరించారు. చల్లటి నీళ్లు జీర్ణవ్యవస్థకు విషమని, వేడి నీళ్లు అమృతం అని ఆయన వెల్లడించారు. కూల్ వాటర్ జీవక్రియను నెమ్మదిస్తుందని, వ్యాయామం చేసిన ఫలితాలు అందకుండా చేస్తుందని వివరించారు.