చాలామందికి రాత్రిపూట పడుకోబోయే ముందు తీపి పదార్థాలు తినాలని ఉంటుంది. స్వీట్లు, చక్కెరతో చేసిన పదార్థాలు మంచివి కాదని పండ్లను ఎంచుకుంటారు. పండ్లు ఆరోగ్యకరమైనవి, జ్యూసీగా ఉండడంతోపాటు పోషకభరితమైనవని వాటిని తింటారు. పండ్లలో ఉండే సహజ చక్కెర వాడితే ఏమీ కాదని అనుకుంటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం సాయంత్రం 4 గంటల తర్వాత పండ్లు తింటే శరీరంపై ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది. పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
1. రక్తంలో చక్కెరస్థాయి పెరుగుదల
చాలా పండ్లలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. రాత్రి భోజనానికి ముందు వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగే ప్రమాదం ఉంది. జనాభాలో ఎక్కువమంది షుగర్తో బాధపడుతున్నారు. కొన్ని పండ్లను తినడం ప్రమాదాన్ని పెంచుతుంది.
2. పోషకాల నష్టం
పండ్లు తింటున్నందున చాలామంది కూరగాయలు, ప్రోటీన్ ఫుడ్స్ను మానేస్తారు. తమ డైట్ షెడ్యూల్లో కేవలం పండ్లనే ఉంచుతారు. అధిక పోషకాలున్న ఇతర ఆహారపదార్థాలను తినకపోవడంతో
శరీరంలో వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
3. నిద్రకు భంగం కలుగుతుంది..
పడుకునే ముందు పండ్లను తీసుకోవడం వల్ల మరింత శక్తి లభిస్తుంది. దీంతో బాడీ యాక్టివ్ అవుతుంది. నిద్రపట్టదు. దీర్ఘాకాలంపాటు అదే కొనసాగితే నిద్రలేమి సమస్యకు దారితీయొచ్చు. అందువల్ల పండ్లను అల్పాహారంగా మాత్రమే తీసుకోవాలి. అవి శరీరం పనిచేసే శక్తిని పెంచుతాయి. శరీరం అలసిపోకుండా
చేస్తాయి.
4. బరువు పెరిగే అవకాశం
పండ్లలో సాధారణంగా కేలరీలు తక్కువగా ఉంటాయి, కాబట్టి ఒక ముక్క తినడం వల్ల గణనీయమైన బరువు పెరుగరు. అయితే, ప్రతిరోజూ సిఫార్సు చేసిన కేలరీల సంఖ్యను తిని, పడుకునే ముందు ఒక అదనపు మీడియం సైజ్ అరటిపండును తింటే అదనంగా 100 కేలరీలు పొందుతారు. తద్వారా బరువు పెరుగుతారు.
పండ్లను ఉదయం, భోజనాల మధ్య ఖాళీ కడుపుతో తినడం మంచిది. పండ్లు తక్షణమే జీర్ణమవుతాయి.
ఇందులో ఎక్కువ పోషకాలుంటాయి. ఫైబర్, విటమిన్లు , సాధారణ చక్కెరలుంటాయి. పండ్లను వ్యాయామానికి ముందు లేదా తర్వాత కూడా తినవచ్చు. వ్యాయామానికి ముందు పండ్లను తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. వర్కౌట్స్ను జోష్గా చేయొచ్చు. వ్యాయామం తర్వాత మీరు పండ్లను తింటే, శరీరం కోల్పోయిన పోషకాలను తిరిగి పొందొచ్చు.