న్యూఢిల్లీ : నైట్ షిఫ్టుల్లో (Night Shifts) పనిచేయడం బరువు పెరుగుదలకు దారితీస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. రాత్రి వేళల్లో పనిచేయడం, ప్రేవుల ఆరోగ్యానికి సంబంధం ఉందని బ్రిటన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ పరిశోధకులు చేపట్టిన అధ్యయనం తెలిపింది.
రాత్రంతా మేలుకుని పనిచేయడం, తెల్లవారుజామున ఆహారం తీసుకోవడం వంటివి మన ఆహార అలవాట్లు, ఆకలిపై ప్రభావం చూపుతాయని, ఫలితంగా బరువు పెరుగుదలకు దారితీస్తుందని పరిశోధకులు తెలిపారు. నైట్ షిఫ్ట్ల్లో పనిచేయడంతో జీవ గడియారం విచ్ఛిన్నమై జీవక్రియల వేగం తగ్గుతుందని గతంలోనూ పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
జీవ గడియారంలో పెను మార్పులు ఆకలిని నియంత్రించే హార్మోన్లను ప్రభావితం చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. నైట్ షిఫ్ట్లో పనిచేసే వారిలో జీవక్రియల వేగం మందగించి అధిక బరువు బారినపడుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది. దీర్ఘకాలంగా నైట్ షిఫ్ట్లో పనిచేసే వారు పగటి వేళ ఎండ తగిలేలా చూసుకోవాలని, కార్డియోవాస్క్యులర్ ఎక్సర్సైజ్ చేయాలని, సరైన వేళల్లో భోజనం చేయాలని పరిశోధకులు సూచించారు.
Read More :