లండన్ : కరోనా మహమ్మారి కట్టడికి బూస్టర్ డోసుల వాడకంపై ఇంకా స్పష్టత రాకున్నా కొవిడ్-19 మూడవ డోసు తీసుకున్న వారిలో ఇతరులతో పోలిస్తే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ఫైజర్ బూస్టర్ డోసుపై నిర్వహించిన ప్రపంచంలో అతిపెద్ద సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
ఫైజర్ వ్యాక్సిన్ మూడవ డోసు తీసుకున్న 12 ఏండ్ల పైబడిన 7,28,321 మందిపై ఈ అధ్యయనం చేపట్టారు. కొవిడ్ బూస్టర్ డోసు తీసుకున్న వారిలో ఐదు నెలల కిందట కరోనా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన వారితో పోలిస్తే అధికంగా యాంటీ బాడీలు ఉత్పన్నమైనట్టు పరిశోధనలో తేలింది. వీరిపై కరోనా తీవ్రత తక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు.