న్యూఢిల్లీ : శీతాకాలం ఆరోగ్యంపై పలు రకాలుగా ప్రభావం చూపుతుంది. చలికాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో గుండె, ఊపిరితిత్తులు, మెదడుపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు అధికమని దీన్ని నివారించేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మెదడుకు రక్త ప్రసరణలో ఆటంకాలు ఏర్పడటం, రక్తనాళాలు చిట్లడం, ధమనుల్లో అడ్డంకులు ఏర్పడటం వంటి కారణాలతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్ న్యూరాలజీ డైరెక్టర్ డాక్టర్ కునాల్ బహ్రాని చెప్పారు. రోగికి ఓసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత పలుమార్లు స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని దీంతో స్ట్రోక్ ఘటనలు తలెత్తకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.
డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం గుండె పోటు తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్ట్రోక్ కారణంగా మరణిస్తున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు తమ జీవితకాలంలో స్ట్రోక్ ముప్పును ఎదుర్కొంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని జీవనశైలి మార్పులతో ముఖ్యంగా శీతాకాలంలో స్ట్రోక్ ముప్పును నివారించవచ్చని డాక్టర్ బహ్రని సూచించారు.
రోజువారీ మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి
తాజా పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు
ఉప్పు వాడకం తగ్గించాలి
నడక, వ్యాయామం
బరువు తగ్గడం
ధూమపానం, మద్యపానానికి దూరం