Peetambaram Leaves | మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లలో మార్పులతో ప్రజలు పలు వ్యాధుల బారీన పడుతున్నారు. దీనికి తోడు ఆందోళనకర పరిస్థితులతో మధుమేహం, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, గుండె సంబంధ వ్యాధులు ప్రజల్నీ వేధిస్తున్నాయి. చర్మ వ్యాధులు, డిప్రెషన్, క్యాన్సర్ వ్యాధులు కూడా వస్తుంటాయి. వీటిని తగ్గించడానికి ప్రజలు టాబ్లెట్లు వేసుకుంటారు. కానీ పీతాంబరం ఆకు తినడం వల్ల ఐదు వ్యాధులను దూరం చేసుకోవచ్చు. పీతాంబరం మొక్కలు మకరందం లక్షణాలు కలిగి ఉంటాయి. ప్రకృతి ప్రసాదించిన వర ప్రసాదం వంటి మొక్కల్లో పీతాంబరం మొక్క ఒకటి.
పీతాంబరం ఆకుకు క్యాన్సర్ వ్యాధిని నిరోధించే కెపాసిటీ ఉంటుంది. ఎలుకలు, మానవ క్యాన్సర్ కణాలపై పీతాంబరం ఆకు రసంతో నిర్వహించిన ప్రయోగాల్లో క్యాన్సర్ కణాలు చనిపోతాయని గుర్తించారు. పీతాంబరం ఆకుల్లో గల ఫ్లేవనాయిడ్, కంప్ఫెరోల్ తదితర మిశ్రమాలు ఉంటాయి. ఇవీ క్యాన్సర్ లక్షణాలను నిరోధిస్తాయి.
పలు రకాల జీవక్రియల మిశ్రమాలతో కలిసి పెరిగే పీతాంబరం ఆకులో లభించే ప్లేవోన్లు, ఫ్లేవనాయిడ్లు, గ్లైకోసైడ్లు, అల్లాటినోన్, డీ గ్లూకోసైడ్ తదితర పదార్థాలు జీవ క్రియను పెంపొందిస్తాయి. సహజ సిద్ధంగా ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుదలకు దారి తీస్తాయి. బ్లడ్ షుగర్ నియంత్రించడానికి పీతాంబరం ఆకులు మంచి ఔషధంగా వినియోగించవచ్చు.
డిప్రెషన్, యాంగ్జైటీ నుంచి రిలీప్ కలిగిస్తాయి పీతాంబరం ఆకులు.. వీటిని వాడటం వల్ల కేంద్రీయ నాడీ వ్యవస్థ సున్నితంగా మారుతూ ఉంటుంది. దీంతో శరీరం నుంచి నిష్క్రియాత్మకత తొలగుతుంది. పీతాంబరం మొక్క నుంచి సేకరించిన మిశ్రమం కూడా డిప్రెషన్ నియంత్రణ ఔషధం మాదిరిగానే పని చేస్తుందని పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
పీతాంబరం ఆకులు నమలడం వల్ల రక్తంలో ప్లేట్లెట్లు పెరుగుతాయి. 21 రోజులు పీతాంబరం ఆకు రసం తాగితే గాయం మానుతుంది. పీతాంబరం ఆకుల పేస్ట్ చర్మంపై రాయడం వల్ల టినియా వెర్సికలర్, సొరియాసిస్, రోసేసియా, మొటిమలు, కాండిడా అలంబికాన్స్, టీసెమీ, సీ హునాటా వంటి చర్మ సంబంధ వ్యాధుల నుంచి రిలీఫ్ పొందొచ్చు.