ఫిబ్రవరి నెలలో వాతావరణం వేగంగా మారుతుంది. చలికాలం నుంచి ఎండాకాలంలోకి ప్రవేశిస్తాం. ఈ నేపథ్యంలో ఆహారం విషయంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?
-ఓ పాఠకురాలు
చలికాలంలో మనం ద్రవపదార్థాలు తక్కువగా తీసుకుంటాం. ఎండాకాలంలో అలా కుదరదు. వాతావరణం వేడెక్కే కొద్దీ శరీరానికి ద్రవ పదార్థాల అవసరం ఎక్కువ అవుతుంది. అందుకే వేసవిలో ద్రవాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. కనీసం రెండున్నర నుంచి మూడు లీటర్ల నీళ్లు తీసుకుంటే మేలు. లేకపోతే, శరీరం డీహైడ్రేషన్కు గురై వాంతులు, విరేచనాలు అవుతాయి. మజ్జిగ ఎక్కువగా తాగాలి. దానివల్ల శరీరానికి కావాల్సిన క్యాల్షియం, ప్రొటీన్లు అందుతాయి. తరచూ నిమ్మరసం తీసుకోవడం వల్ల కూడా ఎండవేడి నుంచి తప్పించుకోచ్చు. ఈ కాలంలో వచ్చే ఖర్బూజ, తర్బూజలాంటి పండ్లు తినాలి. వీటిలో నీటి శాతం ఎక్కువ. అలాగే ఒంటికి చలువ చేసే కీరా ముక్కలు నములుతూ ఉండాలి. బీరకాయలాంటి నీటిశాతం ఎక్కువ ఉండే కూరగాయలను వంటల్లో వినియోగించాలి. మధుమేహులకు రాగిజావ మంచిది.
-మయూరి ఆవుల,న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com