Mosquitoes | న్యూఢిల్లీ, మార్చి 17: కాసేపు హాయిగా కునుకు తీద్దామని పడుకుంటే చాలు.. దోమలు చెవుల దగ్గర కఠోర ధ్వనులతో మోతెక్కిస్తాయి, దొరికిందే చాన్స్ అన్నట్టు రక్తాన్ని పీల్చేస్తాయి. దాంతో ఆ కాస్త నిద్ర అటే పోతుంది. ఇలా మనకేనా? ఇలాంటి ఇబ్బందే ఇంకెవరికైనా వచ్చిందా? అని గుడ్ నైట్ కంపెనీ 1,011 మందిపై సర్వే నిర్వహించగా.. అందులో 55 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారట.
దిండు, పరుపు, వాతావరణ పరిస్థితులు కూడా నిద్రను భంగం చేస్తున్నాయని చెప్పినట్టు సర్వే తెలిపింది. దోమల బెడదతో ముఖ్యంగా పశ్చిమ భారత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, 61 శాతం మంది దోమల వల్లే సరిగా నిద్రపోవటం లేదని తెలిపినట్టు వివరించింది. దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఎక్కువ శాతం మంది అభిప్రాయపడ్డారని పేర్కొన్నది.