రాష్ట్రంలో 15 శాతం కేసులు దీనికి సంబంధించినవే
తెలంగాణ వైద్య నిపుణుల అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్, ఆగస్ట్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాలేయ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్టు తెలంగాణ వైద్య నిపుణుల బృందం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ‘క్లినికోపాథలాజికల్ ప్రొఫైల్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఎట్ ఏ టెరిటరీ కేర్ సెంటర్’ పేరుతో ఈ అధ్యయనం నిర్వహించారు. కేసులు సంఖ్యపరంగా రొమ్ము, తల, మెడ క్యాన్సర్ల తర్వాత నాలుగో స్థానంలో కాలేయ క్యాన్సర్ ఉన్నట్టు అధ్యయంలో తేలింది. ఏటా రాష్ట్రంలో 45వేల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్టు అంచనా వేయగా, అందులో 5 నుంచి 6 వేల వరకు కాలేయ క్యాన్సర్ బాధితులు ఉన్నట్టు వెల్లడించారు. ఈ కేసులు పెరగటానికి ధూమపానం, మద్యం సేవించడమే ప్రధాన కారణమని గుర్తించారు. ప్రధానంగా హైదరాబాద్లో ఈ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మహిళలు కూడా ఇటీవల కాలంలో ధూమపానానికి అలవాటు పడుతుండటంతో వారిలోనూ ఈ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. కాలేయ క్యాన్సర్ రోగుల్లో 15 శాతం మంది మాత్రమే పూర్తిగా కోలుకుంటున్నారని అధ్యయనం పేర్కొన్నది.