National Nutrition Week | మనం ఆరోగ్యంగా జీవించాలంటే పోషకాహారం తప్పనిసరి. మనం తీసుకునే ఆహారంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషక పదార్థాలు లోపించిన ఆహారాలను తీసుకోవడాన్ని పోషకాహార లోపంగా పరిగణిస్తారు. ఉపవాసాలు చేయడం, అనారోగ్య పరిస్థితులు, పేదరికం, మూఢనమ్మకాలు, అవగాహనారాహిత్యం, ఆర్థిక కారణాలు, అపరిశుభ్రత వంటివి ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. పోషకాహార లోపంతో ఎందరో హాస్పిటళ్లలో చేరుతూ ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు. అందుకే పోషకాహారంపై తగిన అవగాహన కలిగించేందుకు ఏటా సెప్టెంబర్ 1 నుంచి వారం రోజులపాటు జాతీయ పోషకాహార వారం నిర్వహిస్తారు.
ఆరోగ్యకరమైన మనుగడ, ఎదుగుదల కోసం పోషకాల అవసరం ఎంతో ఉంటుంది. కార్బోహైడ్రేట్లు, ఫైబర్లు, కొవ్వులు, ప్రోటీన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, విటమిన్లు, నీరు వంటి పోషకాలు మనల్ని సదా ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. వీటిని సమపాళ్లలో నిత్యం మన ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పోషకాహార లోపానికి గురికాకుండా చూసుకోవచ్చు. పోషకాలు సక్రమంగా అందకపోతే మన రోగ్యనిరోధక వ్యవస్థ యాక్టీవ్గా ఉండదు. ఫలితంగా వివిధ వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇలా అందించాలి..
ప్రధాన సంకేతాలు..
ఉద్యోగులు పని ఒత్తిళ్ల కారణంగా ఒకటికి నాలుగు సార్లు కాఫీలు, టీలు తీసుకోవడం, కనిపించగానే సమోసాలు, పిజ్జాలను ఆబగా లాగించేస్తున్నారు. ఇది అనేక వ్యాధులకు గురిచేస్తుందని తెలిసినా.. కడుపు నింపుకోవడానికి అందుబాటులో ఉన్న ఏదో ఒక ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఫలితంగా పోషకాహారం సక్రమంగా అందక అనేక వ్యాధులకు లోనవుతున్నారు. ‘తిండి కలిగితే కండగలదోయ్, కండ కలవాడే మనిషోయ్’ అని ఓ కవి చెప్పినట్లు.. ఆరోగ్యానికి అవసరమైన సమతుల ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. రుచికోసం ఫాస్ట్ఫుడ్ సెంటర్ల వద్దకు వెళ్లి రోగాలు కోరి తెచ్చుకుండా చూసుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.