న్యూఢిల్లీ : మానవ శరీరం సక్రమంగా పనిచేయాలంటే నీరు అత్యంత కీలకం. మన శరీరం 70 శాతం నీటితో నిండిఉంటుంది. మన అవయవాలన్నీ సవ్యంగా పనిచేయాలంటే శరీరానికి హైడ్రేషన్ అవసరం. శరీర పనితీరు సక్రమంగా సాగేందుకు అవయవాలు, కణాలు, టిష్యూస్ నీటిని సంగ్రహించి శారీరక ధర్మం సవ్యంగా సాగేలా చూస్తాయి.
కొందరు వేసవిలోనే నీరు అధికంగా తీసుకుని ఆపై తగినంత నీరు తాగడంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. సీజన్తో సంబంధం లేకుండా శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నోరు తడారిపోవడం, తీవ్రమైన అలసట, నిస్సత్తువ, మూత్రం తక్కువగా రావడం వంటి డీహైడ్రేషన్ లక్షణాలను పసిగడుతూ తగినంత నీరు తీసుకోవాలని చెబుతున్నారు.
ఇక చలికాలంలో కొద్ది మోతాదులో నీరు తీసుకున్నా ఒకేసారి కాకుండా రోజంతా పలమార్లు నీటిని సిప్ చేస్తూ డీహైడ్రేషన్ బారినపడకుండా చూసుకోవాలి. రోజుకు నాలుగు కప్పుల గ్రీన్టీ, రెండు బౌల్స్ సూప్ తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ను నివారించవచ్చు.
రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకుని తీసుకోవడంతో అజీర్తి, మలబద్ధకం సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. ఇది శరీరం హైడ్రేట్గా ఉంచడంతో పాటు జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడే ఇమ్యూనిటిని కలిగిస్తుంది.