న్యూఢిల్లీ : ఆరోగ్యానికి మేలు చేకూర్చే పసుపును (Health Tips) వంటింట్లో తరచూ వాడుతుంటారు. వంటకాలకు రుచిని తీసుకురావడంతో పాటు పసుపులో అద్భుత ఔషధ గుణాలు ఉండటంతో ఎన్నో ఏండ్లుగా వంటింట్లో కీలక దినుసుగా గృహిణులు వాడుతున్నారు. ఇక పసుపు పాలు ప్రతి రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
పసుపు పాలతో సహజంగా నిద్ర లేమిని వదిలించుకోవచ్చు. కంటినిండా నిద్రించేందుకు పసుపు పాలు ప్రతిరోజూ ఓ గ్లాసు తీసుకుంటే చాలని చెబుతున్నారు. వయసు మీద పడటంతో వచ్చే సమస్యలను పసుపుతో నిరోధించవచ్చని, పసుపు పాలు యాంటీ ఏజింగ్గా పనిచేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖంపై వచ్చే ముడతలను నివారించడంతో పాటు చర్మాన్ని నునుపుగా చేసే గుణం పసుపు పాలలో ఉన్నాయి.
ఇక పసుపు పాలలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. పసుపు అద్భుతమైన పెయిన్ కిల్లర్గానూ పనిచేస్తుంది. ముఖ్యంగా పసుపు పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్గా పేరొందగా, ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మ వ్యాధులు, అలర్జీల నివారణలో పసుపును ఉపయోగిస్తారు. రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగితే శరీరం నుంచి టాక్సిన్స్ తొలగి రక్త సరఫరా మెరుగవుతుంది.
Read More :
Tomatoes | రూ.21లక్షల విలువైన టమాటా లోడ్ లారీ మిస్సింగ్