న్యూఢిల్లీ : మధుమేహంతో బాధపడే వారు పండ్లకు దూరంగా ఉండాలని చెబుతుంటారు. అయితే గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువగా ఉండే పండ్లను మధుమేహులు నిరభ్యంతరంగా తినవచ్చని న్యూట్రిషియన్లు చెబుతారు. మధుమేహులు జీఐ తక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం ద్వారా ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలగడంతో పాటు వాటిలో పొటాషియం, ఫైబర్తో పాటు పలు విటమిన్లు, శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
జీఐ తక్కువగా ఉండే పండ్లతో మధుమేహుల్లో చక్కెర, ఇన్సులిన్ లెవెల్స్కు ఎలాంటి చేటు చేయవు. ఇక మధుమేహులు పీచ్, చెర్రీ, ప్లమ్, యాపిల్, ఆరంజ్ వంటి పండ్లను తీసుకోవచ్చని వీటి జీఐ 45 కంటే తక్కువగా ఉండటం వారి ఆరోగ్యానికి మేలు చేస్తుందని న్యూట్రిషియన్లు చెబుతున్నారు.