అధిక రక్తపోటు.. సరికొత్త సమస్య కానేకాదు. కాకపోతే, నానాటికీ పెరుగుతున్న అనారోగ్యకర ధోరణి. శారీరక శ్రమలేని జీవన విధానం చెడు కొవ్వును పెంచేస్తుంటే.. ఒత్తిడి మనసులను చిత్తుచేస్తున్నది. పోషకాలు కరువైన ఆహారం సరేసరి. ఇవన్నీ రక్తపోటుకు రాచమార్గాలే. వెల్లుల్లి, దోస సలాడ్తో హైబీపీని అడ్డుకోవచ్చంటారు ఆహార నిపుణులు.
వెల్లుల్లిని చిదిమి, అందులో దోసకాయ ముక్కలు వేసి… నాలుగు చుక్కల యాపిల్ సిడార్ వెనిగర్ జోడించి కలియతిప్పితే సలాడ్ సిద్ధం. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు.