న్యూఢిల్లీ : నవరాత్రులు (Navratri Fasting) ప్రారంభం కావడంతో ఈ పవిత్ర దినాల్లో చాలా మంది ఉపవాసం ఉంటారు. నవరాత్రుల్లో సాత్వికాహారం తీసుకునేందుకు పలువురు మొగ్గుచూపుతారు. ఈ నవరాత్రుల్లో ఉపవాసంతో బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
మసాలాలు, ఉప్పు, కారం తగ్గించిన వంటలను తీసుకోవడంతో పాటు రెగ్యులర్గా వాడే పిండికి బదులు భిన్నమైన, ప్రత్యామ్నాయ పిండితో ఆహార పదార్ధాలను తయారుచేసుకోవడం ద్వారా ఆరోగ్యకర ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. ఫాస్టింగ్ ఫ్రెండ్లీ పిండికి పలు ప్రత్యామ్నాయాలను వారు సూచిస్తున్నారు. పండ్ల విత్తనాల నుంచి తయారుచేసే కుట్టు పిండి అని పిలిచే గ్లూటెన్ ఫ్రీ, సూక్ష్మ పోషకాలతో నిండిన బక్వీట్ ఫ్లోర్తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి.
ఈ పిండితో రుచికరమైన రోటీలు, దోశెల వంటి ఎన్నో డిష్లను తయారుచేసుకోవచ్చు. వాటర్ చెస్ట్నట్ పిండి ఫాస్టింగ్ సమయాల్లో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యాల్షియం అధికంగా ఉండే ఈ పిండితో కుట్టు పిండిని కలిపి బర్ఫీలు, హల్వాలు, పూరీలు, పకోడాలు చేసుకోవచ్చు. సగ్గుబియ్యం పిండిని కూడా వాడుతూ పరాటాలు, పూరీలు, రోటీలు టేస్టీగా తయారుచేసుకోవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే స్వీట్ పొటాటో పిండితో పలు రకాల చాట్స్ను ఎంజాయ్ చేయచ్చు. గ్లూటెన్ లేని వెయిట్ లాస్ డైట్గా రాజ్గిర పిండితో పూరీలతో పాటు పలు రకాల టేస్టీ టిక్కాలు ఆస్వాదించవచ్చు.
Read More :