భోపాల్: పెంపుడు కుక్క పట్ల డాగ్ ట్రైనర్స్ దారుణంగా వ్యవహరించారు. ట్రైనింగ్ సెంటర్ గేట్కు దానిని వేలాడదీసి చంపారు. (trainers kill dog) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ సంఘటన జరిగింది. షాజాపూర్కు చెందిన వ్యాపారవేత్త నిఖిల్ జైస్వాల్ రెండేళ్ల కిందట ఒక జాతి కుక్కను కొనుగోలు చేశాడు. ఈ ఏడాది మే నెలలో భోపాల్లోని ఆల్ఫా డాగ్ ట్రైనింగ్ సెంటర్లో ఆ కుక్కను చేర్పించి శిక్షణ ఇప్పిస్తున్నాడు. నాలుగు నెలల ట్రైనింగ్ కోసం నెలకు రూ.13,000 చొప్పున చెల్లించాడు. సెప్టెంబర్లో ఆ డాగ్కు ట్రైనింగ్ పూర్తికావాల్సి ఉంది.
కాగా, అక్టోబర్ 9న ఆ డాగ్ యజమాని నిఖిల్ జైస్వాల్కు ట్రైనర్ రవి కుష్వాహా ఫోన్ చేశాడు. ఆయన కుక్క అనారోగ్యంతో చనిపోయిందని చెప్పాడు. అయితే ఏదో జరిగి ఉంటుందని అనుమానించిన డాగ్ యజమాని నిఖిల్ దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరోవైపు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ట్రైనింగ్ సెంటర్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ఫుటేజ్ తొలగించినట్లు గమనించి సైబర్ సెల్ సహాయంతో పునరుద్ధరించారు. అక్కడి సిబ్బంది ట్రైనింగ్ సెంటర్ గేట్కు ఆ డాగ్ను వేలాడదీసి దారుణంగా చంపిన ఫుటేజ్ చూసి పోలీసులు షాక్ అయ్యారు. డాగ్ ట్రైనర్ రవి కుష్వాహా, అక్కడ పని చేసే నేహా తివారీ, తరుణ్ దాస్ను అరెస్ట్ చేశారు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Dog killed by training centre owner in #bhopal@Manekagandhibjp ji please help us in putting them behind the bar.@deespeak #AnimalCruelty #AnimalAbuse #killed #pfa #peopleforanimal pic.twitter.com/9mGJduzYqr
— शोbhit (@2IC_Shobhit) October 18, 2023