గాడిద పాలంటే చులకనగా భావించే వారందరూ తెలుసుకోవాల్సిన విషయమేమిటంటే.. ఆవు, మేక, ఒంటె పాలతో పోలీస్తే గాడిద పాలల్లో పోషక విలువలు ఎక్కువ. ఈ పాలు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి దొరకడం చాలా అరుదు కావడం వల్ల వీటికి ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది.
కరోనా మహమ్మారి వచ్చిన తరువాత ప్రజలు రోగ నిరోధక శక్తిని పెంపొదించే ఆహారం తీసుకోవడంలో శ్రద్ధ చూపిస్తున్నారు. గాడిద పాల తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలియగానే దానికున్న బాగా పెరిగిపోయింది. మన దేశంలో ముఖ్యంగా మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో ఒక లీటర్ గాడిద పాలు రూ.10,000కు అమ్ముడవుతోంది. గాడిద పాలు తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడమే కాకుండా న్యూమోనియా, డెంగ్యూ, జలుబు వంటి వ్యాధులు దూరమవుతున్నాయని హింగోలి ప్రజలు నమ్ముతున్నారు.
దీంతో ఆ ప్రాంతంలో నివసించే బాలాజీ మేస్వాడ్ అనే వ్యక్తి ఒక స్పూన్ గాడిద పాలను రూ.100కు అమ్ముతున్నాడు. గాడిదను పలు ప్రాంతాల్లో తిప్పుతూ పాలు కావాల్సిన వారికి తాజాగా అందిస్తున్నాడు.
గాడిద పాలలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని, పలు కేన్సర్లకు కూడా ఇవి ఔషధంగా ఉపయోగపడతాయని గతంలో పలు అధ్యయనాలలో తేలింది. కానీ గాడిద పాలను పచ్చిగా తాగితే అందులో కొన్ని టాక్సిన్స్ ఉండడం వల్ల ఆరోగ్యానికి హాని జరిగే ప్రమాదముంది. అందుకే గాడిద పాలను బాగా కాచిన తరువాత తాగాలని డాక్టర్లు చెబుతున్నారు.