ఎందుకంటే 30ఏళ్లు వచ్చాక మనిషి శరీరంలో చాలా రకాల మార్పులు వస్తుంటాయి. అవి ఆరోగ్యంపై బాగా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ముప్పైల్లోకి వచ్చాక మనం ఏం తింటున్నాం.. ఏం తినట్లేదు అన్న విషయాలను గమనించుకుంటూ ఉండాలి.
ముప్పైల్లోకి వచ్చిన తర్వాత శరీరానికి తప్పక అవసరమైన న్యూట్రియంట్లు కొన్ని ఉన్నాయి. ఆ న్యూట్రియంట్లు ఏంటో .. వాటిని కలిగి ఉండే ఆహార పదార్థాలేంటో త్వరగా తెలుసుకుందాం పదండి..
ముప్పైల్లోకి వచ్చాక శరీరంలో ఐరన్ శాతం తగ్గుతుంటుంది. మీ ఆరోగ్యం బాగుండాలంటే తగ్గుతున్న ఐరన్ ను మీరు తిరిగి పెంపొందించుకోవడం చాలా అవసరం. ఐరన్ లోపంతో పలు రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరానికి ఐరన్ అందాలంటే పాలకూర, బ్రకోలిలతో పాటు నట్స్, విత్తనాలను మీ ఆహార పదార్థాల్లో తప్పక ఉండేలా చూసుకోవాలి.
విటమిన్-డీ అనేది ఎముకలు దృఢంగా ఉండేందుకు అవసరసమైన న్యూట్రియంట్. శారీరక దృఢత్వంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు, హర్మోన్ల సమతుల్యతను కాపాడేందుకు విటమిన్-డీ శరీరానికి బాగా తోడ్పడుతుంది. ఇందుకోసం సాల్మన్, సారిడైన్ లాంటి చేపలతో పాటు పుట్టగొడుగులు, పాలు లాంటివి కూడా శరీరానికి సహజంగా విటమిన్-డిని అందిస్తాయి.
ఈ మధ్య కాలంలో యుక్త వయసులోనే గుండె, బ్రెయిన్ సమస్యలతో ఇబ్బందులు అధికమవుతున్నాయి. గుండె, బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగా ఉండేందుకు ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ కలిగి ఉండే ఆహార పదార్థాలు ప్రతిరోజూ మీ ఆహారంలో ఉండేలా చూసుకొండి. అన్ని రకాల చేపలతో పాటు వాల్నట్స్, అవిసె గింజలు, చియా విత్తనాలను తప్పక తినండి.
వయసు పెరిగేకొద్దీ ఎముకల్లో సాంద్రత తగ్గిపోతుంది. దీనిపై అజాగ్రత్తగా ఉంటే చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఎముకల్లో సాంద్రత పెంచే కాల్షియంను మీరు తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. కాల్షియం కండరాళ్ల కదలికలను మెరుగుపరచడంతో పాటు నరాల పనితీరును పెంచుతాయి. పాలు, వెన్న, యోగర్ట్ లాంటి పదార్థాలను మీ రోజూవారీ ఆహార పదార్థాల్లో చేర్చుకోవడం మర్చిపోకండి.
రక్తకణాలు మెరుగ్గా పనిచేస్తేనే శరీరంలోని అన్ని భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎర్ర రక్త కణాలు ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి ఫొలేట్ తప్పనిసరి. ముఖ్యంగా గర్భిణీలకు దీని అవసరం బాగా ఉంటుంది. శనగలు, నట్స్, బ్రోకలీ లాంటి వాటిలో ఫొలేట్ పుష్కలంగా ఉంటుంది.