న్యూఢిల్లీ : గతంలో కరోనా హాట్స్పాట్గా మారిన దేశ రాజధాని ఢిల్లీని తాజాగా డెంగ్యూ వణికిస్తోంది. గతవారం రోజుల్లో ఢిల్లీలో ఏకంగా 1171 డెంగ్యూ కేసులు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. తాజా కేసులతో ఈ ఏడాది ఇప్పటివరకూ ఢిల్లీలో 2708 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ బారినపడి గత వారం ముగ్గరు మరణించగా మొత్తం మరణాలు తొమ్మిదికి ఎగబాకాయని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.