New Study : ప్రతిరోజూ ఓ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ తీసుకుంటే జ్ఞాపక శక్తి, థింకింగ్ స్కిల్స్ మెరుగవుతాయని మాస్ జనరల్ బ్రిఘమ్ నిర్వహించిన తాజా పరిశోధన వెల్లడించింది. మల్టీవిటమిన్ సప్లిమెంట్స్, కకోవా ఎక్స్ట్రాట్స్పై విస్తృతంగా చేపట్టిన అధ్యయనంలో కీలక వివరాలు వెలుగుచూశాయి. ప్రపంచవ్యాప్తంగా 5.5 కోట్ల మంది అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధుల బారినపడుతున్న క్రమంలో ఈ పరిశోధన వైద్య చికిత్సలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
వయో వృద్ధుల్లో జ్ఞాపకశక్తి క్షీణించడం ప్రధాన ఆరోగ్య సమస్యగా పరిణమించిందని, రోజూ మల్టీవిటమిన్ సప్లిమెంట్ తీసుకోవడం ద్వారా కాగ్నిటివ్ ఏజింగ్ నెమ్మదిస్తుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. 20 అత్యవసర పోషకాలతో కూడిన మల్టీవిటమిన్ సప్లిమెంట్ను రోజూ తీసుకోవడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయని అధ్యయన రచయిత చిరాగ్ వ్యాస్ పేర్కొన్నారు.
రోజూ మల్టీవిటమిన్ సప్లిమెంట్తో జ్ఞాపకశక్తి క్షీణతను నిరోధించవచ్చని కాగ్నిటివ్ ఏజింగ్ మందగించేలా చేయవచ్చని సీనియర్ రచయిత డాక్టర్ ఒలివియ ఒకిరీకె చెప్పారు. ఇక రెండేండ్ల వ్యవధిలో మల్టీవిటమిన్ సప్లిమెంట్ తీసుకున్నవారు వీటిని తీసుకోని వారితో పోలిస్తే నేర్చుకునే నైపుణ్యాలు, జ్ఞాపకశక్తి నిలుపుకోవడం వంటి అంశాల్లో గణనీయ పురోగతి సాధించారని వెల్లడైంది. ఈ అధ్యయన వివరాలను మెరుగ్గా అర్ధం చేసుకోవాలంటే పోషకాల ప్రాధాన్యత ఇతర వయో సంబంధిత కారకాల మధ్య సంబంధంపై మరింత దృష్టి సారించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
Read More :