Cancer | సియోల్, మార్చి 10: క్యాన్సర్ నిర్ధారణ కోసం ప్రస్తుతం రక్త పరీక్షలు, రేడియోలాజికల్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. కొంతమంది రెగ్యులర్గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో క్యాన్సర్ ఉంటే బయటపడుతున్నది. అయితే, చాలామంది ఈ టెస్ట్లు చేయించుకొనేందుకు ముందుకురావడం లేదు. దీంతో క్యాన్సర్ చివరి స్టేజీలో బయటపడుతున్నది. ప్రాణాలు బలికొంటున్నది. దీనికి పరిష్కారమార్గంగా దక్షిణ కొరియాకు చెందిన కొరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్ స్సెన్సెస్ పరిశోధకులు అతి తక్కువ ధరలో వేగంగా క్యాన్సర్ నిర్ధారించే పద్ధతిని కనుగొన్నారు.
మూత్రం ద్వారా క్యాన్సర్ను పసిగట్టే కొత్త సెన్సర్ను ఆవిష్కరించారు. ఈ అధునాతన విధానంలో కేవలం 10 యూఎల్ (యూనిట్స్ ఫర్ లీటర్)ల మూత్రంపై కాంతిని రేడియేట్ చేసి ప్రొస్టేట్ క్యాన్సర్, క్లోమగ్రంథి క్యాన్సర్ను గుర్తించొచ్చు. ఈ పరికరం స్ట్రిప్ రూపంలో ఉండడంతో క్యాన్సర్ను అతి తక్కువ సమయంలో అధిక సున్నితత్వంతో పసిగట్టగలదు. ఈ విధానంలో ఎక్కువ మందికి అతి తక్కువ సమయంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయొచ్చని, తమ పరిశోధన ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.