న్యూఢిల్లీ : డెల్టా ప్లస్ వేరియంట్పై దేశీ వ్యాక్సిన్ల ప్రభావాన్ని పరిశీలిస్తున్నామని వారం పదిరోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ పేర్కొన్న క్రమంలో ఈ దిశగా తీపికబురు అందింది.డెల్టా ప్లస్ వేరియంట్పై ఈ రెండు వ్యాక్సిన్లు సమర్ధంగా పనిచేస్తాయని ఒడిషాకు చెందిన ఆరోగ్య నిపుణులు డాక్టర్ నిరోజ్ మిశ్రా పేర్కొన్నారు. భారత్లో వాడుతున్న రెండు కరోనా వ్యాక్సిను్ల డెల్టా ప్లస్ వేరియంట్పైనా పనిచేస్తాయని తాజా అథ్యయనాల్లో వెల్లడైందని బ్రిటన్ నుంచి వెలువడిన వార్తా కథనం వెల్లడించిందని డాక్టర్ మిశ్రా తెలిపారు.
డెల్టా ప్లస్ వేరియంట్పై ఆందోళన అవసరం లేదని, మెరుగైన ప్రజారోగ్య వసతులతో మహమ్మారిని ఎదుర్కోవచ్చని చెప్పారు. ఒడిషాలో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ కేసు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో డాక్టర్ మిశ్రా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు డెల్టా ప్లస్ వేరియంట్పై కొవిషీల్డ్, కొవ్యాక్సిన్ల సామర్ధ్యం గురించి పరీక్షిస్తున్నామని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ వెల్లడించారు. డెల్టా ప్లస్ వేరియంట్ ప్రస్తుత్తం 12 దేశాల్లో వ్యాపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇక భారత్లోని పది రాష్ట్రాల్లో 48 కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం అవి ఆ ప్రాంతానికే పరిమితమయ్యాయని చెప్పారు.