మనం మధ్యాహ్నంపూట అన్నం లేదా చపాతీ ఏది తిన్నా..ఎంత మొత్తంలో తీసుకున్నా మగతగా ఉంటుంది. తిన్న వెంటనే నిద్ర తన్నుకొస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులకు ఇది ఆందోళన కలిగిస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి లంచ్ తర్వాత నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా? మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్స్, కార్బొహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. దీంతో భోజనం తర్వాత శక్తిస్థాయిలు తగ్గిపోతాయి. శరీరం సెరటోనిన్ను ఉత్పత్తి చేయడం వల్ల రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగిపోతాయి. దీంతో శరీరంలో శక్తిస్థాయిలు తగ్గిపోయి, అలసిపోతాం. అందుకే తిన్న తర్వాత బాడీ మగతగా అనిపిస్తుంటుంది. దీన్ని అరికట్టేందుకు మన వంటింట్లో దొరికే దాల్చిన చెక్క ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
దాల్చిన చెక్క ఎలా సహాయపడుతుంది?
మధ్యాహ్న భోజనం తర్వాత అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో నిద్రరాదు. మధుమేహ రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాల్చిన చెక్క వల్ల శరీరానికి ఇంకా కొన్ని ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడంతోపాటు హార్మోన్ల సమతుల్యతకు ఉపయోగపడుతుంది. కాఫీలో చక్కెరకు బదులుగా దాల్చినచెక్క పొడిని వేసుకుంటే అదనపు శక్తిని లభిస్తుంది. ఇది శక్తి స్థాయిలను స్థిరీకరిస్తుంది. అలసటను నివారిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.