హైదరాబాద్: విటమిన్లు మన శరీరం సక్రమంగా పనిచేయడానికి చాలా అవసరమని మనందరికి తెలుసు. ఎముకల బలహీనత, రక్తహీనత వంటివి ఏర్పడినప్పుడు డాక్టర్లు ఇటు కాల్షియం, అటు ఐరన్ మాత్రలు రాసే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది విటమిన్ మాత్రల్ని గుండుగుత్తగా ఒకేసారి వేసేసుకుంటుంటారు. అలా చేయడం పొరపాటని న్యూట్రిషనిస్టులు అంటున్నారు.
కాల్షియం, ఐరన్ మాత్రలు ఒకేసారి వేసుకుంటే అవి రెండూ ఒకదానితో మరొకటి పోటీ పడతాయి. అంతిమంగా వ్యర్థమవుతాయి. అదీ సంగతి. అందుకే రెండింటి మధ్య ఆరుగంటల వ్యవధి ఉండాలట. ఉదాహరణకు ఒకటి మధ్యాహ్నం భోజనం తర్వాత వేసుకుంటే ఇంకొకటి రాత్రి భోజనం తర్వాత వేసుకోవాలి. అలా చేస్తే రెండింటి ప్రయోజనాలు శరీరానికి సంపూర్ణంగా లభిస్తాయి.