Food Combinations | మన శరీరానికి కావాల్సిన శక్తి మనం తీసుకునే ఆహారాల నుంచి అందుతుంది. ఏ రకం ఆహారం తీసుకున్నా అది మనకు మేలే చేస్తుంది. వాటిలో ఇమిడి ఉండే పోషకాలు, విటమిన్లు, ఖనిజలవణాలు మన శరీరంలో జీవప్రక్రియలు సజావుగా కొనసాగేందుకు ఉపయోగపడతాయి. మనం నిత్యం తీసుకునే ఆహారాలు కాంబినేషన్లతో నిండి ఉంటాయి. వివిధ కాంబినేషన్లతో కూడిన డైలీ డైట్ను మనం ఆనందిస్తుంటాయి. అయితే, కొన్ని ఫుడ్ కాంబినేషన్లు మనకు ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి 10 ఫుడ్ కాంబినేషన్లు మీ కోసం..
పాలు – చేపలు
మన పూర్వీకుల కాలం నుంచి కూడా పాలు – చేపలను కలిపి తినకూడదని వింటూనే ఉన్నాం. ఈ రెండు ఆరోగ్యపరంగా పోషకాలతో నిండి ఉన్నప్పటికీ పొటెన్సీ పరంగా వ్యతిరేకంగా ఉంటాయి. పాలు చల్లదనానికి.. చేపలు వేడికి ప్రతిరూపాలుగా చెప్తుంటారు. ఈ రెండింటిని కాంబినేషన్గా తీసుకున్నట్లయితే రక్తప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
పాలు – తులసి
ఈ రెండు మన ఆరోగ్యానికి ఎంతో మంచివని తెలుసు. ఈ రెండు కూడా మనకు చల్లదనాన్ని ఇస్తాయి. అయితే, రెండింటిని ఒకేసారి తినడం మంచిది కాదని పోషకాహార నిపుణులు సెలవిస్తున్నారు. రెండింటి మధ్య అర్ధ గంట సమయం ఉండేలా చూసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
పాలు – పండ్లు
ఈ రెండూ మనకు ఆరోగ్యాన్నిచ్చేవే. అయితే ఈ రెండింటిని ఒకేసారి తీసుకోవడం మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. పాలను పుల్లటి పండ్లతో గానీ, అరటిపండ్లతో గానీ తీసుకోకుండా చూడాలి. బనానా షేక్ అనే ద్రావకాన్ని చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. అయినప్పటికీ ఇది ఆరోగ్యకర కాంబినేషన్ కాదని వారు హెచ్చరిస్తున్నారు.
బంగాళదుంప – ప్రొటీన్
జీర్ణక్రియకు వేర్వేరు ఎంజైమ్లు అవసరం. కాబట్టి ప్రొటీన్లు, స్టార్చ్లు వ్యవస్థను ఓవర్లోడ్ చేయడంతో కలిసి ఉండవు. అందుకని ప్రొటీన్లు కలిగిన బంగాళదుంపలు రుచికరంగా ఉండకపోవడమే కాకుండా జీర్ణక్రియను ఆలస్యం చేస్తాయి.
దోస – టొమాటో
దోసకాయ, టొమాటో అనుకూలమైనవి కాదు. వీటిని పెరుగుతో కలుపకుండా చూసుకోవాలి. సలాడ్లు, రైతా తయారు సమయంలో వీటి కాంబినేషన్పై ఆలోచించాలి. దోసకాయ – టమోటాలు నిమ్మకాయతో కూడా సరిపోవు. అందుకని సలాడ్, కాచుంబర్ సలాడ్పై నిమ్మరసం వేయాలి.
తేనె – ఉష్ణము
శరీరంలో జనించే ఉష్ణాన్ని చల్లబరిచేందుకు ఈ రెండు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే, ఈ రెంటిని ఒకేసారి తీసుకోవడం వల్ల మరింత ఉష్ణం జనించే అవకాశాలు ఉంటాయని నిపుణులు సెలవిస్తున్నారు.
ధాన్యాలు – పండ్లు
ధాన్యాలు – పండ్లను ఒకేసారి తినకుండా జాగ్రత్తపడాలి. భోజనంతో పాటు పండ్లు తీసుకోవడం వల్ల అదనంగా గ్లూకోజ్ శరీరానికి అందుతుంది. ఫలితంగా కొన్ని రకాల సమస్యలు తలెత్తే వీలుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాలకూర – నువ్వుల పేస్ట్
పాలకూరతో కలిపి నువ్వుల పేస్ట్ తీసుకోవడం వల్ల లూజ్ మోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని వీటిని ఒకేసారి తినొద్దని సెలవిస్తున్నారు నిపుణులు.
బెల్లం – పెరుగు
ఈ రెండు మన శరీరం బరువు పెరిగేందుకు కారణమవుతాయి. ఈ రెండింటిని ఒకేసారి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గపై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి. బెల్లం నిత్యం తినే అలవాటు ఉన్నా మంచిదేనంటున్నారు.
నెయ్యి – తేనె
వీటిని ఒకేసారి తీసుకోవడం కూడా మంచి అలవాటు కాదంటున్నారు పోషకాహార నిపుణులు. వీటిని 2:1 నిష్పత్తిలో తీసుకుంటే ఫర్వాలేదంట. వీటితో పాటు మరే ఇతర పదార్థాలు ఉండకపోతే.. ఈ రెండింటిని సమాన మొత్తంలో వాడకూడదని హెచ్చరిస్తున్నారు.