కాబోయే అమ్మలు రోజుకు కనీసం పదిహేను నిమిషాలు ధ్యానం చేస్తే.. సుఖప్రసవంతోపాటు అనేక ప్రయోజనాలు ఉంటాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
కాబోయే అమ్మలు రోజుకు కనీసం పదిహేను నిమిషాలు ధ్యానం చేస్తే.. సుఖప్రసవంతోపాటు అనేక ప్రయోజనాలు ఉంటాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
లోతైన ధ్యానం మనసుకు కొత్త శక్తిని ఇస్తుంది. ఎండార్ఫిన్ల ఊట పెరుగుతుంది. దీనివల్ల నొప్పిని తట్టుకునే శక్తి వస్తుంది. ప్రసవం ఇబ్బందికరం కాదు.
గర్భధారణ సమయంలో ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. పురిటినొప్పిని భరించగలమా లేదా అనే భయం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పట్ల ఆందోళన, పాపా-బాబా.. అనే సంశయం. దీనివల్ల అడ్రినలిన్, కార్టిసోల్ .. హార్మోన్ల ఊట పెరుగుతుంది. దీంతో అధిక రక్తపోటు, మధుమేహం దాడి చేస్తాయి. ధ్యానం ఆ ఒత్తిడిని అధిగమించే మార్గం చెబుతుంది.
కాబోయే తల్లికి నిద్రలేమి తీవ్ర సమస్య. ధ్యానంతో ఇట్టే నిద్రపడుతుంది. ఆలోచనల మీద అదుపు ఉండటం వల్ల చికాకులు ఇబ్బంది పెట్టవు.
ప్రసవానంతర డిప్రెషన్ చాలామందిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ధ్యానంతో ఈ అవరోధాన్ని కూడా అధిగమించవచ్చు. మిగిలినవారితో పోలిస్తే ధ్యానం చేసేవారిలో చనుబాలు సమృద్ధిగా ఉంటాయని అనేక పరిశోధనల్ల్లో వెల్లడైంది.
ధ్యానం గుండె పనితీరును, రక్తపోటును సాధారణ స్థితిలో ఉంచుతుంది. దీంతో ప్రీ-ఎక్లంప్సియా లాంటి సమస్యలు రావు. ఈ రుగ్మత వల్ల గర్భిణికి అమాంతం రక్తపోటు పెరిగిపోయి తల్లీబిడ్డల ప్రాణాలు సంక్షోభంలో పడతాయి.