న్యూఢిల్లీ : తేజ్ పత్తా, బే లీఫ్గా పిలిచే బిర్యానీ ఆకును ఎన్నో డిష్ల్లో వాడటంతో పాటు వంటింట్లో ముఖ్యమైన దినుసుగా భావిస్తుంటారు. వంటకాల రుచిని పెంచడంతో పాటు బిర్యానీ ఆకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని (Health Tips) నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో పలు వ్యాధులకు చికిత్సలో ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారు. బిర్యానీ ఆకును ఎండబెట్టి పొడిగా చేసి తేనీరుగా సేవిస్తే జీర్ణ సమస్యలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
చర్మ సౌందర్యానికి ఈ ఆకు పొడిని, నూనెను వాడుతుంటారు. అయితే దీన్ని రోజుకు ఒక గ్రాము మించి తీసుకుంటే చెమట పట్టడం, అతి మూత్రవ్యాధికి దారితీస్తుందని, దీన్ని పరిమితంగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బిర్యానీ ఆకుతో చేసిన టీ తాగడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్ను తొలగించి కడుపు శుభ్రమవుతుంది. మలబద్ధకాన్ని నివారించి శరీరం ప్రొటీన్లను గ్రహించే శక్తిని ఇవ్వడంతో పాటు జీర్ణక్రియ సాఫీగా సాగేలా సహకరిస్తుంది. బిర్యానీ ఆకులో ఫ్లేవనాయిడ్స్, సపోనిన్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో గాయాలు త్వరగా మానుతాయి. ఇంకా బిర్యానీ ఆకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
మెరుగైన బ్రెయిన్ పవర్
మధుమేహ నియంత్రణ
చెడు కొలెస్ట్రాల్కు చెక్
ఇన్ఫ్లమేషన్ తగ్గుముఖం
జీర్ణక్రియ మెరుగుదల
గాయాలు త్వరగా మానడం
Read More :
Health Tips | ఊబకాయంతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Surrogacy Planning | సరోగసీ కోసం ప్లాన్ చేస్తున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి..!