కరోనా వ్యాప్తి తర్వాత దేశంలో ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో డెంగ్యూతో విజృంభిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు వందల సంఖ్యలో డెంగ్యూ కేసులు రికార్డయ్యాయి. కేసుల వేగంగా పెరుగడంతో ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై ప్రభావం చూపుతున్నది. అయితే ఈ సారి డెంగ్యూలో కొత్త వైవిధ్యాలు కనిపిస్తున్నాయని, అందుకే పరిస్థితి వేగంగా క్షీణిస్తోందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
దోమల కాటు ద్వారా డెంగ్యూ వ్యాపిస్తుంది. దీంతో రక్తంలో ప్లేట్లెట్ స్థాయిలు వేగంగా తగ్గుతాయి. తీవ్రమైన సందర్భాల్లో రోగి మృతికి కారణం కూడా అవుతుంది. దోమలు భారీగా ఉండే ప్రాంతాల్లో డెంగ్యూ వ్యాపించేందుకు ఎక్కువ ప్రమాదం ఎక్కువ ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. దీంతోనే ఆరోగ్య నిపుణులు డెంగ్యూ నుంచి సురక్షితంగా ఉండేందుకు దోమల నివారణ చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచించడానికి ఇదే ప్రధాన కారణం. ఈ సారి చాలా మంది రోగులకు రెండు రకాలైన తీవ్రమైన కేసులు నిర్ధారణ అవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.
డెంగ్యూ సెరోటైప్-2 (DEN-2) చాలా మంది రోగుల్లో గుర్తించినట్లు ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ఇది సాధారణ డెంగ్యూ కంటే ప్రమాదకరమైందని చెబుతున్నారు. ఈ రకమైన డెంగ్యూ హెమరేజిక్ జ్వరానికి కారణమవుతుంది. ఈ రకమైన డెంగ్యూ కేసులతో బాధపడుతున్న రోగుల్లో రక్తపోటు వేగంగా తగ్గుతుంది. షాక్ లేదంటే మృతి చెందే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇదే కాకుండా అధిక జ్వరం కారణంగా రోగి శోషరస వ్యవస్థ (Lymphatic system) దెబ్బతినడం, ముక్కు నుంచి రక్తస్రావం, చర్మం కింద రక్తం గడ్డకట్టడానికి దారి తీస్తుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డెంగ్యూలో జ్వరంతో బాధపడుతున్న వ్యక్తులకు కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయని అందరూ నమ్ముతుంటారు. అయితే, డెంగ్యూ లక్షణాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని వైద్యులు చెప్పారు. ఈ రకమైన డెంగ్యూతో బాధపడుతున్న వ్యక్తులకు జ్వరం లేదని, అయినప్పటికీ వారి ప్లేట్లెట్లు చాలా వేగంగా తగ్గాయని పేర్కొంటున్నారు. అలాంటి రోగుల్లో.. సాధారణ డెంగ్యూకి భిన్నంగా కీళ్ల నొప్పుల సమస్య కూడా తగ్గుతోంది. ఈ క్రమంలో ఈ రకమైన డెంగ్యూ మరింత ప్రమాదకరమైందిగా నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇందులో రోగి తన ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా మారే వరకు తెలియదని చెప్పారు.
ఇప్పటి వరకు డెంగ్యూకు నిర్ధిష్ట చికిత్స అందుబాటులో లేనప్పటికీ, ఔషధాల ద్వారా లక్షణాలను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. డెంగ్యూ సోకిన రోగుల రక్తంలో ప్లేట్లెట్లు తగ్గడం సాధారణం. కాబట్టి మొదటి లక్ష్యం ప్లేట్లెట్ల స్థాయిని పెంచడం ముఖ్యమన్నారు. గరిష్ఠంగా విశ్రాంతి తీసుకుంటూ.. ఫ్లూయిడ్స్ ఇవ్వడం ద్వారా లక్షణాల నుంచి రోగి త్వరగా కోలుకునేందుకు సహాయపడుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. డెంగ్యూను నివారించడానికి అత్యంత ముఖ్యమైన విషయం దోమలపై నివారణకు చర్యలు తీసుకోవడం. దోమల వికర్షకాలను ఉపయోగించడం, పరిసరాలను శుభ్రం చేసుకోవడం, దోమతెరలను ఉపయోగించడం ద్వారా డెంగ్యూ వ్యాప్తిని నిరోధించవచ్చని పేర్కొంటున్నారు. దీంతో పాటు డెంగ్యూ నిరోధించడానికి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా చర్యలు తీసుకోవాలి. పగటిపూట పూర్తిగా చేతులను కప్పేలా దుస్తులను ధరించాలని సూచిస్తున్నారు.