జైపూర్ : రాజస్ధాన్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ రూరల్ ఒలింపిక్స్ గేమ్స్లో సీనియర్ సిటిజన్లు సత్తా చాటుతున్నారు. కబడ్డీ మ్యాచ్లో యువకుల జట్టుకు వృద్ధులు చుక్కలు చూపుతుండటంతో అందరూ విస్తుపోతున్నారు. రాష్ట్రంలోని 44,000కు పైగా గ్రామాల్లో గ్రామీణ ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి.
30 లక్షల మందికి పైగా గ్రామస్తులు ఈ గేమ్స్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ గేమ్స్లో భాగంగా యువకులు, వృద్ధుల టీం మధ్య జరిగిన ఓ కబడ్డీ మ్యాచ్ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్ధాన్ ప్రభుత్వ ట్విట్టర్ ఖాతా ఈ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో యువకుల టీంతో పోటీపడిన వృద్ధులు మైదానంలో చలాకీగా, చురుకుగా కదులుతూ ఆటలో పైచేయి సాధించాలనే కసితో ఆడటం నెటిజన్లను ఆకట్టుకుంది.
राजीव गांधी ग्रामीण ओलंपिक खेल
आज खेलों के माध्यम से दिखा ग्रामीणों के जोश का नया रूप
बुजुर्ग और युवा मिलकर ले रहे कबड्डी के पारंपरिक खेल का आनंद
ग्रामीण परिवेश में खेलों से बढ़ रहा है आपसी सौहार्द#Rajasthan @ashokgehlot51@AshokChandnaINC @rajcmo pic.twitter.com/RZ82Obgb9k
— सूचना एवं जनसम्पर्क विभाग, राजस्थान सरकार (@DIPRRajasthan) August 29, 2022
గ్రామీణులు ఒలింపిక్ గేమ్స్లో పాల్గొంటూ ఆహ్లాదకర వాతావరణం మధ్య సత్తా చాటుతున్నారని ఈ పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరలవుతోంది. అంకుల్ ఈజ్ టైగర్ అని ఓ ట్విట్టర్ యూజర్ కామెంట్ చేయగా, వెరీ గుడ్ స్టార్ట్…సానుకూల వాతావరణం క్రియేట్ అయిందని మరో యూజర్ రాసుకొచ్చాడు.