-శంకరాచార్యుడు: 8వ శతాబ్దానికి చెందినవాడు. ఆయన ప్రాంతం కలాడి (కేరళ). ఈయన అద్వైత సిద్ధాంత ప్రతిపాదకుడు.
-రామానుజాచార్యుడు: 11వ శతాబ్దానికి చెందినవాడు. శ్రీ పెరంబదూర్ (తమిళనాడు) ప్రాంతానికి చెందినవాడు. ఈయన విశిష్ఠాద్వైత ప్రతిపాదకుడు.
-మధ్వాచార్యుడు: 13వ శతాబ్దానికి చెందినవాడు. శృంగేరి (కర్ణాటక) ప్రాంతానికి చెందినవాడు. ద్వైత సిద్ధాంత ప్రదిపాదకుడు.
-నింబార్కుడు: 15వ శతాబ్దానికి చెందినవాడు. ఆంధ్రప్రదేశ్కు చెందినవాడు. ద్వైతాద్వైత సిద్ధాంత ప్రతిపాదకుడు.
-వల్లభాచార్యుడు: ఆంధ్రప్రదేశ్కు చెందిన శుద్ధాద్వైత సిద్ధాంత ప్రతిపాదకుడు.
-అన్నమాచార్యుడు: 16వ శతాబ్దానికి చెందినవాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఈయన శ్రీ వెంకటేశ్వరస్వామి కీర్తనలు పాడారు.
-బసవేశ్వరుడు: 12వ శతాబ్దానికి చెందినవాడు. కర్ణాటక ప్రాంతానికి చెందిన ఈయన వీరశైవ మత స్థాపకుడు.
-చైతన్యుడు: 15-16వ శతాబ్ద కాలానికి చెందినవాడు. ప్రాంతం బెంగాల్. శ్రీకృష్ణ భక్తి ప్రచారం చేశారు.
-మీరాబాయి: 15వ శతాబ్దానికి చెందినవారు. ప్రాంతం రాజస్థాన్. శ్రీకృష్ణ భక్తి ప్రచారకురాలు.
-రామానందుడు: 15వ శతాబ్దానికి చెందినవాడు. ప్రాంతం ఉత్తరప్రదేశ్. ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేసిన తొలి భక్తి ఉద్యమకారుడు.
-కబీర్: 15-16వ శతాబ్ద కాలానికి చెందినవాడు. ప్రాంతం ఉత్తర భారతదేశం. ఈయన పరమానంద శిష్యుడు, నిర్గుణ భక్తి కారుడు. కబీర్ రచనలను దోహాలు అంటారు.
-తులసీదాస్: 15-16వ శతాబ్ద కాలానికి చెందినవాడు. ప్రాంతం ఉత్తర భారతదేశం. ఈయన రామచరిత మానస్ను రచించాడు.
-గురునానక్: 15-16వ శతాబ్ద కాలానికి చెందినవాడు. ప్రాంతం తల్వండి గ్రామం, పంజాబ్. సిక్కుమత వ్యవస్థాపకుడు, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రచారం చేశాడు.