మూసాపేట(అడ్డాకుల) మే 7: ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసమే ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి డ్రైఫ్రూట్స్ పంపిణీ చేస్తున్నట్లు జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ తెలిపారు. మండలంలోని నిజాలాపూర్ గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే సమకూర్చిన డ్రైఫ్రూట్స్ను కరోనా బాధిత కుటుంబాలకు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, సింగిల్విండో చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు గూపని కొండయ్య, శివరాములు, భీమయ్య, దేవుని శ్రీను, బాల్రాజ్, గొల్ల కృష్ణ, పల్లె జగన్తోపాటు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
అడ్డాకులలో..
అడ్డాకుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కరోనా బాధితులకు డ్రైఫ్రూట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సర్పంచులు శ్రీకాంత్, కిషన్నాయక్, ఎంపీటీసీ చంద్రయ్య, మండల కోఆప్షన్ సభ్యుడు ఖాజాగోరి, టీఆర్ఎస్ మహిళా సెల్ అధ్యక్షురాలు సుజాత, నాయకులు రమేశ్గౌడ్, కావలి కృష్ణయ్య, దేవేందర్రెడ్డి, చంద్రమోహన్రెడ్డి, శ్రీనివాస్యాదవ్, విజయ్కుమార్రెడ్డి, మహేశ్యాదవ్ పాల్గొన్నారు.