అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్
ఆక్సిజన్ బ్యాంక్ సేవలు ప్రారంభం
విద్యానగర్, జూన్ 3: నిరుపేద కరోనా బాధితులకు చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ద్వారా సినీ హీరో చిరంజీవి ఆక్సిజన్ అందించి ఊపిరి పోస్తున్నారని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ పేర్కొన్నారు. నగరంలోని మంకమ్మతోటలో గల శివానీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ‘చిరంజీవి’ ఆక్సిజన్ బ్యాంక్ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఆక్సిజన్ బ్యాంక్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. జిల్లాకు 50 ఆక్సిజన్ సిలిండర్లు, 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందించినట్లు తెలిపారు. సేవా దృక్పథంతో చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని నిర్వాహకుడు వేల్పుల వెంకటేశ్కు సూచించారు. కార్పొరేటర్లు దిండిగాల మహేశ్, గుగ్గిళ్ల జయశ్రీ-శ్రీనివాస్, శివాని డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ వంగపల్లి సతీశ్, అన్నవరం దేవేందర్, చిరంజీవి ఫ్యాన్స్ బాధ్యులు హరికృష్ణ గౌడ్, నవీన్, అంజి యాదవ్, గోషిక అజయ్, ఫహద్, శ్రీధర్, కుమార్, రాకేశ్ గౌడ్, అరవింద్, బబ్లు, నరేశ్, కపిల్ తదితరులు పాల్గొన్నారు.