వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాస్కుతో పాటు ఫేస్ షీల్డ్ ధరించారు. కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్న వార్డుల్లో సీఎం కేసీఆర్ కలియతిరిగారు. కరోనా రోగులను పలుకరించి మనోధైర్యం ఇస్తున్నారు. వైద్య సేవలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సౌకర్యాలపై సిబ్బంది వద్ద సీఎం ఆరా తీశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్తో పాటు పలువురు ఉన్నారు. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించి, కరోనా రోగులను పరామర్శించిన విషయం తెలిసిందే.