దుండిగల్/కుత్బుల్లాపూర్, మే 12 : ప్రజలంతా స్వీయనియంత్రణతో ఉండి కరోనాను కట్టడి చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లితో పాటు కొంపల్లి మున్సిపాలిటీల పరిధిలో ప్రజలకు కరోనా పరీక్షల కేంద్రాలను వేర్వేరుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్ధారణ కోసం వచ్చే ప్రజలందరికీ మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచనలు, సలహాలు ఇచ్చారు.
లాక్డౌన్లో ప్రజలు ఎవ్వరూ బయటకు రావద్దని, ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కును ధరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నిజాంపేట్ కార్పొరేషన్ కమిషనర్ గోపి, మేయర్ కొలన్నీలాగోపాల్రెడ్డి, కొంపల్లి కమిషనర్ రఘు, చైర్మన్ శ్రీశైలం, వైస్చైర్మన్ రత్లావత్ గంగయ్యనాయక్, వైద్యాధికారిణి నిర్మల, కార్పొరేటర్లు పాండు, సుధాకర్, బాలజీనాయక్, వీరేందర్రెడ్డి, సుబ్బారావుతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.