ముంబై ,మే 6: స్టాక్ మార్కెట్లు ప్రారంభంలో లాభనష్టాల ఊగిసలాడినా, ఆతరవాత మధ్యాహ్నానికి లాభాల్లోకి వచ్చేశాయి. మధ్యాహ్నం గం.12 వరకు అప్ అండ్ డౌన్స్ కనిపించినా ఆ తర్వాత మాత్రం అంతకంతకూ ఎగిసి 275 పాయింట్ల లాభాల్లో కనిపించింది. గురువారం రిజర్వ్య్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చర్యలు, అంతర్జాతీయ, ఆసియా మార్కెట్ సానుకూలతలు కలిసి వచ్చాయి. అలాగే వ్యాక్సినేషన్ వేగవంతం ఇన్వెస్టర్ల సెంటిమెంటును కాస్త బలపరిచింది. దీంతో సూచీలు ఎగిశాయి