హైదరాబాద్: దేశమంతటా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. రోజూ దాదాపు నాలుగు లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా ఉధృతి కొనసాగుతున్నది. అయినాసరే పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విజయోత్సవాలు నిర్వహించకుండా మాత్రం ఈసీ నిషేధం విధించింది. ఈ మేరకు వారం క్రితమే ఆదేశాలు కూడా జారీచేసింది.
కానీ, ఈసీ ఆదేశాలు జనం భేఖాతరు చేశారు. ఈసీ ఆదేశాలను అస్సలు పట్టించుకోకుండా జనం విజయోత్సవాల్లో మునిగి తేలుతున్నారు. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు, తమిళనాడులో డీఎంకే శ్రేణులు జోరుగా సంబురాలు జరుపుకుంటున్నారు. తమ అభిమాన నేతల ఇండ్ల ముందు గుంపులుగా చేరి నృత్యాలు చేస్తున్నారు. ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుంటున్నారు. ఈ ఆదేశాలను లెక్కచేయకపోవడమేగాక, మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం అనే కొవిడ్ నిబంధనలను కూడా తుంగలో తొక్కారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా రవి శంకర్
బెంగాల్లో బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా!
బ్రేకింగ్ న్యూస్: ఒడిశాలో రెండు వారాలు కంప్లీట్ లాక్డౌన్
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త