భువనేశ్వర్: ఒడిశాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు గడిచిన 24 గంటల వ్యవధిలోనే అక్కడ 10 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో కరోనా కట్టడి కోసం ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మే 5వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 14 రోజులపాటు కఠిన లాక్డౌన్ విధిస్తున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు.
ప్రస్తుతం దేశమంతటా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతున్నదని, ఈ నేపథ్యంలో చైన్ను బ్రేక్ చేయడం కోసం లాక్డౌన్ నిర్ణయం తీసుకుకోవాల్సి వచ్చిందని ఒడిశా సీఎం వెల్లడించారు. కాగా, కరోనా మహమ్మారి కట్టడి కోసం ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీల్లో కూడా అక్కడి ప్రభుత్వాలు లాక్డౌన్లు విధించాయి. ఇతర రాష్ట్రాల్లోనూ నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లు కొనసాగుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఆక్సీజన్ కోసం బైక్ అమ్మేందుకు సిద్ధమైన ఫిదా స్టార్
టోలిగంజ్లో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో వెనుకంజ
సాగర్ ఉప ఎన్నిక ఫలితం.. 4 వేల ఓట్ల మెజార్టీతో భగత్ ముందంజ