మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు
కాలనీల్లో పర్యటన
సీసీసీ నస్పూర్, జూన్ 22 : నస్పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చే స్తానని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు పేర్కొన్నారు. రెండోవార్డు ప్రశాంత్నగర్, 14వ వార్డు సంఘమల్లయ్యపల్లె, 15వ వార్డు గాంధీనగర్లలో మంగళవారం ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్య, రోడ్లు, డ్రైనేజీ, తదితర సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయన దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తున్నామన్నా రు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుం డా మున్సిపల్ అధికారులు, పాలకవర్గ సభ్యులు నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు అందిస్తున్నామని, కొన్నిచోట్ల జరుగుతున్న పనులను త్వర గా పూర్తిచేసి అందరికీ అందిస్తామన్నారు. డ్రైనేజీలను ఆధునీకరిస్తున్నామని, సెంట్ర ల్ లైటింగ్ సిస్టం, డివైడర్స్, రోడ్ల వేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, కమిషనర్ తుంగపిండి రాజలింగు, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు వంగ తిరుపతి, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, చ ర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్రెడ్డి, కౌన్సిలర్లు బోయ మల్లయ్య, కుర్మిళ్ల అన్నపూర్ణ, కోఆప్షన్ స భ్యుడు నాసర్, నాయకులు హైమద్, పంబాల ఎర్రయ్య, బద్రి మల్లేశ్, రౌతు రజిత, మోతె కనుకయ్య, రవిగౌడ్, కాటం రాజు, తదితరులు పాల్గొన్నారు.