పరీక్ష విధానం
– నాలుగు సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సబ్జెక్టులో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఎ, సెక్షన్ బి.
– ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి.
– మొత్తం 200 ప్రశ్నలు. 720 మార్కులు.
– ప్రతి సరైన జవాబుకు నాలుగు మార్కులు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు -1 మార్కు కోత విధిస్తారు.
– పెన్ పేపర్ బేస్డ్ టెస్ట్. పరీక్ష సెంటర్లో ఇచ్చే బాల్ పాయింట్ పెన్తో ఓఎంఆర్లో జవాబులు గుర్తించాలి.
– పరీక్ష కాలవ్యవధి మూడు గంటల 20 నిమిషాలు.
– పరీక్ష 13 భాషల్లో నిర్వహిస్తారు. రాష్ట్ర అభ్యర్థులు తెలుగులో కూడా పరీక్ష రాయవచ్చు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగు భాషలో ఉంటుంది.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్). జాతీయస్థాయిలో నిర్వహించే ఈ పరీక్షను 2019 నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
– అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీలు, దేశంలోని కాలేజీల్లో జాతీయస్థాయి కోటాలో, ఎయిమ్స్, జిప్మర్, డీయూ, బీహెచ్యూ, ఏఎంయూ, ఏఎఫ్ఎంసీ, జీజీఎస్ఐపీయూ, ఈఎస్ఐసీ, డీమ్డ్ యూనివర్సిటీలు కూడా నీట్ ర్యాంక్ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తాయి.
– నోట్: ఆయా యూనివర్సిటీల నిబంధనల కనుగుణంగా ప్రవేశాలు ఉంటాయి.
-ఇంటర్ (బైపీసీ) లేదా సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్ ఉత్తీర్ణత లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
– డిసెంబర్ 31 నాటికి అభ్యర్థుల వయస్సు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎటువంటి గరిష్ఠ వయో పరిమితి లేదు.