దశాబ్ద కాలం కింద మనం కన్న కలలన్నీ సాకారమౌతున్న వేళ అంకితభావంతో నీరు పల్లమెరుగు సామెతను
తిరుగరాసిన ధీశాలి ఎవరు? అగాధాల్లో సాగిన నదులను ఎగువకు పారించిన చైతన్యం ఎవరిది? సస్యశ్యామల పంటలతో కల్లం మురిసిపోవడానికి కారణ భూతులెవరు?
రైతు దేశానికి జీవనాడియై రైతుబంధువుగా నోటికి బుక్కెడు బువ్వనందిస్తూనే ఉంటాడు ఆడపిల్లలున్న తండ్రి కల్యాణలక్ష్మితో మెరిసె కండ్లతో ధైర్యంగా ఉండేందుకు వెన్నుదన్నుగా ఉన్నదెవరు?
నిధులు నీళ్ళు నియామకాలు భగీరథ, కాకతీయలతో జలమయమైన మన పల్లెలు సుజలధారలతో దాహాలను తీర్చి ఎండాకాలంలో నిండుగా చెరువులు మెరుపులీనె మత్స్య సంపద పసిడి పంటల రాశుల వెనుక ఎవ్వరి ఆలోచన యుక్తులున్నయ్!
సబ్బండ వర్ణాల స్వయం ఉపాధికి మూలవిరాట్ ఎవరు? కులమతాలకతీతంగా ప్రగతిపథంలోకి
మన బంగారు తెలంగాణ మార్పునకు నడుం బిగించే నాయకులెవరు? మార్పులు కనుల ముందు ఒక్కొక్కటిగా నెరవేరుతుంటే తెలంగాణ అమరవీరుల కలలు సాకారమైనట్లే..
కలలు ఒక్కొక్కటిగా సాకారమౌతుంటే దశాబ్ది ఉత్సవాలు శతాబ్ది ఒరవడికి నాంది గీతం పాడుతున్నది
తెలంగాణ జాతిపిత అపర చాణక్యుడు మాన్యశ్రీ కేసీఆరే!!!