భారత్లో ఎన్నడూ లేనంత స్థాయిలో నిరుద్యోగం పెరిగింది. కరోనా సంక్షోభం ముగిసి ఏడాది కావస్తున్నా నిరుద్యోగం తగ్గడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీచేయడం, తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించాలి. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగింది. బంగ్లాదేశ్, మెక్సికో, వియెత్నాం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్లో నిరుద్యోగ రేటు అధికంగా ఉన్నది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఈఐ) ప్రకారం దేశంలో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో 6.4 శాతం, అక్టోబర్లో 7.2 శాతం నిరుద్యోగిత నమోదైంది. నిరుద్యోగం పెరగడానికి కరోనా కూడా ఒక కారణమే. కరోనా కాలంలో ఖర్చును తగ్గించుకోవడానికి, ఉద్యోగులను తొలగించే పద్ధతిని బహుళజాతి కంపెనీలు మొదలు చిన్నతరహా కంపెనీలు కూడా అవలంబించడం వల్ల భారత్లో నిరుద్యోగం పెరిగిందని సీఎంఈఐ పేర్కొన్నది. 2020 కరోనా లాక్డౌన్ కాలంలో 15-23 ఏండ్ల మధ్య యువకులే ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోయారని ఒక అధ్యయనంతో తేలింది. కరోనా సంక్షోభం ముగిసి ఏడాది గడుస్తున్నా నిరుద్యోగ తీవ్రత అనకున్నంత స్థాయిలో తగ్గలేదు. దీనికి కారణం సంక్షోభ కాలంలో మూతపడిన అనేక సంస్థలు ఆర్థిక కారణాలతో తిరిగి తెరుచుకోక పోవ డం ఒక కారణమైతే, పలు కంపెనీలు ఆర్థిక సమ స్యలతో ఉత్పత్తిని గణనీయంగా తగ్గించుకున్నా యి. అదే సమయంలో తమ ఉద్యోగుల సంఖ్యను కూడా కుదించుకున్నాయి.
‘నిరుద్యోగమనేది విద్యావంతులు, డబ్బున్నవారు మాత్రమే భరించగలిగే వస్తువు. పేదవారు, నైపుణ్యం లేని లేదా తక్కువ నైపుణ్యాలున్న వ్యక్తులు దీన్ని భరించలేరు’ అని ఆర్థికవేత్త రాధికా కపూర్ అన్నారు. కానీ నేడు ఉన్నతవిద్యను అభ్యసించిన వ్యక్తులే ఎక్కువగా నిరుద్యోగంలో చిక్కుకుపోతున్నారు.
‘నిరుద్యోగం అనేది విద్యావంతులు, డబ్బున్నవారు మాత్రమే భరించగలిగే వస్తువు. పేదవారు, నైపుణ్యం లేని లేదా తక్కువ నైపుణ్యాలున్న వ్యక్తులు దీన్ని భరించలేరు’ అని ఆర్థికవేత్త రాధికా కపూర్ అన్నారు. కానీ నేడు ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తులే ఎక్కువగా నిరుద్యోగంలో చిక్కుకుపోతున్నారు. బాగా చదువుకున్న వ్యక్తులు తక్కువస్థాయి, హోదా తక్కువ ఉన్న ఉద్యోగాలను చేసేందుకు ఇష్టపడరు. మరోవైపు తక్కువ విద్యార్హతలు కలిగి ఉన్నప్పటికీ పేదవారు మాత్రం చేతికొచ్చిన పనిని చేసుకుంటూ ఉపాధి పొందడానికి ప్రయత్నిస్తుంటారు. దేశంలోని శ్రామిక శక్తిలో మూడొంతుల మంది స్వయం ఉపాధి పొందుతున్నవారే. వీరికి రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్, హెల్త్ కేర్, మెటర్నిటీ బెనిఫిట్స్ వంటి లాంటి సామాజిక భద్రత ప్రయోజనాలు ఉండవు. ఉద్యోగభద్రత కారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పెరిగింది. ఈ ఉద్యోగాలకు పోటీ పడుతున్న వారిలో చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంజినీరింగ్, ఎం బీఏ పట్టభద్రులున్నారు. ఉన్నత చదువులు చదివిన వీరంతా, తక్కువ విద్యార్హతతో లభించే చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేయడానికి కూడా పోటీ పడు తున్నారు. అలాగే ఉన్నత విద్యా వంతులు కూడా ఉపాధి కోసం చిన్నవైనప్పటికీ ప్రైవేటు ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు.
భారత్లోని కార్మికుల్లో ఎక్కువ మంది దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారని, వారి ఉనికి సందిగ్ధావస్థలో ఉందని రాధికా కపూర్ అన్నారు. భారత్లో ఉద్యోగాలు చేస్తున్నవారిలో నెలకు జీతంగా రూ.9,750 కన్నా తక్కువ పొందుతున్నవారు దాదాపు 55 శాతంగా ఉన్నారని సర్వేలు తెలుపుతున్నాయి. అయితే రోజుకు కనీస వేతనం రూ. 375 ఉండాలని 2019లో నిపుణుల కమిటీ ప్రతిపాదించింది. కానీ ఈ ప్రతిపాదన ఇప్పటికీ అమ లు కాలేదు. ప్రాథమికంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, ఆ తర్వాత సేవారంగ ఆధారిత ఆర్థికవ్యవస్థకు మారడం దేశంలో గ్రామీణ నిరుద్యోగం పెరిగిందని చెప్పవచ్చు. పెద్దగా నైపుణ్యాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వగలిగే తయారీ సంస్థలు లేదా కర్మాగారాల్లో మన దగ్గర చాలా తక్కువగా ఉన్నాయి. దేశీయ తయారీరంగాన్ని ప్రోత్సహించేందుకు ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. పేరుకే దేశీయ తయారీ రంగమని చెప్పుకొన్నప్పటికీ ఆ రంగంలో ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది మాత్రం శూన్యం.
ఈ నేపథ్యంలో దారిద్య్రరేఖకు దిగువ ఉన్న గ్రామీణ కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం లాంటి ద్వారా ఉపాధి కల్పించాలి. చాలా కాలంగా నిరుద్యోగులుగా ఉన్నవారికి నిరుద్యోగ భృతి ఇచ్చే విషయాన్ని ప్రభుత్వాలు పరిశీలించాలి. ప్రభుత్వరంగ సంస్థల్లో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీచేయాలి. తయారీ, సేవలరంగాన్ని ప్రోత్సహించి పరిశ్రమల్లో ఉద్యోగాల కల్పనకు తోడ్పాటునందించాలి.
(వ్యాసకర్త: రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్, సింగరేణి భవన్)
-దండంరాజు రాంచందర్ రావు
98495 92958