సహజంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తాయి. కానీ ఇప్పుడు కొందరు తమ స్వార్థప్రయోజనాల కోసం మునుగోడు ఉప ఎన్నికను సృష్టించారు. అయితే తెలంగా ణ వ్యతిరేకులు ఎన్ని కుట్రలు కుహకాలు పన్నినా టీఆర్ఎస్ విజయ పతాకను అడ్డుకోలేరనటం చారిత్రక సత్యం.
తెలంగాణలో వలసవాదుల కుట్రలు, కుతంత్రాలు అనేక రూపాల్లో ఇంకా సాగుతూనే ఉన్నయి. ఏ చిన్న సందర్భం వచ్చినా తెలంగాణను బలహీన పరిచే కుట్రల కు తెగబడుతున్నరు. అయితే, తెలంగాణ జాతి రక్షకుడైన కేసీఆర్ అప్రమత్తంగా ఉంటూ వారి ఆటలను సాగనీయ టం లేదు. వారి నడ్డి విరిచే విధంగా కుట్రలను చిత్తుగా ఓడించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలుపుతున్నరు. మహాకవి కాళోజీ చెప్పినట్లు.. ప్రాంతేతరులు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమివేయాలి. ప్రాంతం వారే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర వేయాలి.
2014లో రాష్ట్ర అవతరణ తర్వాత టీఆర్ఎస్ ప్రభు త్వం ఏర్పడింది. ఏడాదిలోనే జరిగిన ఉప ఎన్నికలో పసునూరి దయాకర్ నాలుగు లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. అదే ఏడాది కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణంతో జరిగిన నారాయణఖేడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిచింది. తర్వాత పాలేరులో రాంరెడ్డి వెంకట్రెడ్డి మర ణంతో వచ్చిన సానుభూతిని సైతం పక్కకు నెట్టి టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం గట్టారు. హుజూర్నగర్ స్థానా న్ని సైతం ప్రజలు టీఆర్ఎస్కు కట్టబెట్టారు. తర్వాత జరిగిన నాగార్జున సాగర్లో జానారెడ్డి లాంటి ఉద్ధండులను పక్కనపెట్టి ప్రజలు టీఆర్ఎస్ వెంట నిలవటం గమనా ర్హం. ఇక దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో స్థానిక ప్రత్యేక పరిస్థితుల్లో గెలిచామని అనిపించుకొని వాపునే బలుపు అనుకొని బీజేపీ నేతలు విర్రవీగుతున్నరు.
బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్షా, నడ్డా తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్నరు. కానీ తెలంగాణ ప్రజలు చైతన్యం కలవారు. ఉత్తరభారతంలో, గుజరాత్లో బీజేపీ ప్రభుత్వాలు ఎటువంటి నిర్వాకానికి పాల్పడుతున్నాయో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నరు. మతాల మధ్య చిచ్చుపెట్టి, విద్వేష రాజకీయాలతో రాజ్యమేలాలనుకుంటే తెలంగాణలో సాగనీయమని తెగేసి చెప్తున్నరు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ.. అభివృద్ధి, సంక్షేమాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఈ నేపథ్యంలోంచే దేశ ప్రజలు ముఖ్యంగా రైతులు కేసీఆర్ వైపు చూస్తున్నరు. అన్నింటా విఫలమైన మోదీ బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపి దేశ స్థాయిలో తెలంగాణ తరహా అభివృద్ధి, సంక్షేమ పాలన కోసం కేసీఆర్ను ఆహ్వానిస్తున్నరు. ఫలితంగానే దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమనే నినాదం ఊపందుకున్నది.
దేశ ప్రజల మనోభావాలు గుర్తించిన కేసీఆర్ దేశాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కబంధ హస్తాల నుంచి కాపాడాలని నడుం కట్టారు. ఈ క్రమంలోనే కేసీఆర్ను ఇక్కడే అడ్డుకోవాలని బీజేపీ కుట్రలు చేస్తున్నది. అందులో భాగంగానే తెలంగాణలో వరుస ఉప ఎన్నికలకు తెరలేపుతున్నది. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి లాంటి వారికి కాంట్రాక్టుల ఆశ చూపి వారి చేత రాజీనామా చేయించి, తెలంగాణలో కాలుమోపాలని చూస్తున్నది. కాంట్రాక్టుల కోసం అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందుగా ఉప ఎన్నికను మునుగోడు ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నరు. ఈ దుష్ట రాజకీయ కుట్రలను ప్రజలు గమనించాలి. ఓట్ల కోసం వచ్చే బీజేపీ, కాంగ్రెస్ నేతలను నిలదీయాలి. ఢిల్లీ నేతల చెప్పులు మోసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వారిని తరిమికొట్టాలి. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి రథాన్ని ముందుకు తీసుకుపోవాలి. మునుగోడు ప్రజలు ముందుచూపుతో అభివృద్ధి, సంక్షేమాలకు పట్టం కట్టాలి. చరిత్రలో మునుపెన్నడూ రాని అత్యధిక మెజారిటీతో టీఆర్ఎస్ను గెలిపించాలి.
– తుంగ బాలు, 99859 30246
(వ్యాసకర్త: పరిశోధక విద్యార్థి, ఓ యూ)