ప్రపంచమే అబ్బురపడేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు హృదయపూర్వకంగా నిర్వహించుకునే ఒక సంప్రదాయ పండుగలా ఆయన జయంతిని నిర్వహించడం గొప్ప విషయం. చరిత్రలో ఎవరూ, ఎప్పుడూ చేయని విధంగా 125 అడుగుల ఎత్తు గల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడం దేశం గర్వించదగిన విషయం.
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో దేశాన్ని పాలించిన వివిధ పార్టీలు, ప్రధానులు తమ పేరు మీద, తమ తల్లిదండ్రు ల పేరు మీద పథకాలు, ప్రాజెక్టులు ప్రకటించుకున్నారు. కానీ రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ పేరుతో ఏ ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని ప్రారంభించలేదు. జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని ఆ తర్వాత వచ్చిన పలువురు ప్రధానుల వరకు ఎవ రూ అంబేద్కర్కు సముచిత స్థానం కల్పించలేదు. కనీసం అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పెట్టలేదు. దండలు వేసి, నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోయారే తప్ప ఏనాడూ అంబేద్కర్ను తలచుకునేలా గొప్ప నిర్ణయాలు తీసుకున్న పాపాన పోలేదు.
అలాంటిది 1989లో ప్రధాని అయిన వీపీ సింగ్ అంబేద్కర్ జయంతిని జాతీ య సెలవు దినంగా ప్రకటించారు. అంతేకాదు, అంబేద్కర్కు భారతరత్న ప్రకటించిన ఘనత కూడా ఆయనదే. ఇంకా ఆయన పేరుతో రెండు రూపాయల నాణెం, రెండు రూపాయల పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో తొలిసారిగా అంబేద్కర్ నిలువె త్తు చిత్రపటాన్ని పెట్టారు.అంబేద్కర్ మనుమడైన ప్రకాష్ అంబేద్కర్కు రాష్ట్రపతి కోటాలో నామినేటెడ్ రాజ్యసభ సభ్య త్వం ఇప్పించిన ఘనత కూడా మాజీ ప్రధాని వీపీ సింగ్దే.
ఆ తర్వాత అంబేద్కర్ కు అంతటి గుర్తింపునిచ్చిం ది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. అవకాశవాద పార్టీలకు చెం పదెబ్బలా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అం బేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయ డం చాలా సంతోషకరమైన విషయం. ప్రపంచంలో అత్యధిక విగ్రహాలున్నది అంబేద్కర్కు మాత్రమే. భారతదేశంతో పాటు అమెరికా, జపాన్, చైనా, శ్రీలంక, రష్యా, థాయ్లాండ్లలో ఆయన విగ్రహాలున్నాయి. ఇక మనదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ వేలాదిగా సం ఖ్యలో విగ్రహాలున్నాయి. అయితే దేశం లో ఇప్పటివరకూ ఉన్న విగ్రహాల్లో కెల్లా ఎత్తయినదిగా తెలంగాణ అంబేద్కర్ విగ్రహం ఖ్యాతి గడించబోతున్నది. 125 అడుగుల ఆకాశమెత్తు లోహ విగ్రహాన్ని నేడు సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ జయంతిని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తుండటం తెలంగాణకే కాదు దేశానికే గర్వకారణం.