ఇంకెంతకాలం? ఏమేమి జరుగాలి? ‘కల్లోలం’ శృతి మించి మితిమీరితే నియంత్రణ దుస్సాధ్యం కాదా? అతి తక్కువ జనాభా ఉన్న దేశాల్లోనే ఆందోళనలను నియంత్రించి, ప్రశాంతత నెలకొల్పడం గగనమవుతున్నది. తద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, మానవ సంబంధాల సంక్షోభం వెరసి భయానక స్థితిని తలపిస్తున్నాయి.
దశాబ్దాల తరబడి ప్రభుత్వాల నిర్వాకం వల్ల అశాస్త్రీయ, అప్రజాస్వామిక నిర్ణయాలు అమలవుతున్నాయి. ఫలితంగా ప్రజ లు రోడ్లపైకెక్కి దావానలం సృష్టించాలా? మే ల్కొని సంస్కరించి ఉద్ధరించే ప్రయత్నం జరగవద్దా? నిశ్చేష్టతకు, నిర్లిప్తతకు అందరూ బలైపోతే ఎవరు బాధ్యత వహించాలి? దేశంలోని మేధావులు, సిద్ధాంతకర్తలు, ఆర్థిక శాస్త్రవేత్తలు, దేశంలోని అరిష్టాల్ని, అల్లకల్లోలాలని నివారించలేరా? వాస్తవాల్ని విశ్లేషిస్తూ దిశా నిర్దేశం చేయగల జర్నలిస్టు మేధావులు, సంఘ సేవా తత్పరులు, విభిన్న మతాల అగ్రశ్రేణి ప్రవక్తలు సుదూరంలో అగుపించే పరిస్థితిని గమనించలేరా? ఏదో ఒక విస్తృత ప్రణాళికా కల్పనలో అందరూ ఏకమై దిశా నిర్దేశం చేసే ప్రయత్నం ఏమైనా మొదలు పెట్టాలి కదా! ఏ రాజకీయ పార్టీ పైనా, ఏ రాజకీయ నాయకుడిపైనా సం పూర్ణ విశ్వాసం లేదు కదా! అది నేటి దుస్థితి.
రాజకీయ పార్టీల సిద్ధాంతాల ప్రణాళికలు, ఆలోచనల ప్రాతిపదికగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది. క్రితం జరిగిన పరిణామాలు మనకు పాఠం నేర్పాలా? దూరదృష్టి కొరవడిన నాయకుల నిర్వాకం మనకు పాఠాలు నేర్పడం లేదా? అంతటి ఘోరమైన దుస్థితి దాపురిస్తే ప్రభుత్వాలు తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్ల ఉత్పన్నమయ్యే దుర్భర పరిస్థితులకు మనం బలవుతున్నాము.
రాజకీయాల్లో అశాస్త్రీయ నిర్ణయాలవల్ల మతాల మధ్య ఘర్షణలు పోటెత్తుతున్నాయి. తద్వారా పెచ్చరిల్లిన వైషమ్యాలు, అజ్ఞాన మూ కలకు వదిలేయబడ్డ ఉద్యమాలుగా మారుతున్నాయి. ఉద్యమాల్ని నియంత్రించగల ధీరోదాత్త నాయకత్వం కరువై రౌడీ మూకల నుంచి సంఘవిద్రోహశక్తుల హస్తగతమవుతున్నాయి. దేశంలో నెలకొన్న భయానక స్థితిని పోలీసు, మిలిటరీ వ్యవస్థలకు అప్పగించి భారం మోపుతున్నది. ప్రభుత్వాలు చేష్టలుడిగి నిస్సహాయం గా మిగిలిపోతున్నాయి. పరిస్థితులు పూర్తిగా నియంత్రణ కోల్పోతే చేతులు కాలిన తర్వాత పట్టుకోవడానికి ఆకులు కూడా దొరకవు.
ఉద్రేకపూరిత ఉపన్యాసాల హోరులో బలహీన ఉద్వేగాల వెల్లువలో ఎందరో అమాయకులు బలవుతున్నారు. పరిపూర్ణ అవగాహనతో రాజకీయ కల్లోలాలని, సామాజిక ఉద్యమాల్ని నివారించాలి. కానీ నిలకడైన అభిప్రాయాలు లేని సామాన్య జనాల చేతుల్లో పెట్టి పరిష్కారం దిశగా చేసే ప్రయత్నం సఫలం కానేరదు. అత్యున్నత స్థాయిలో మేధోపరమైన ఆలోచనలతో పరిష్కరించవలసిన సమస్యలే కాదు తీసుకునే నిర్ణయాలు కూడాప్రతి చర్యల్ని ప్రేరేపిస్తాయి. ఈ విషయాన్ని రాజకీయ దురంధరులు, చట్ట సభల నిర్వహకులు ఆలోచించి సరైన పంథాలో దిశా నిర్దేశం చేయగలగాలి. ప్రతిపక్షాలు రాజ్యాధికారమే పరమావధిగా కాకుండా దేశ సంక్షే మం, జనాభ్యుదయం, ప్రశాంత జనజీవనం వారి ఆలోచనల్లో భాగమై వారి పాత్రను నిర్దుష్టంగా మలచుకోవాలి.
మత విద్వేషాలు స్పష్టంగా విభజన రేఖల్ని గీస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు చలించక పోవడం దుర్మార్గం. వ్యవస్థల్ని గుప్పిట్లో ఉంచుకొన్న ప్రభుత్వాలే కాకుండా విజ్ఞులైన మేధావులు, చింతనాపరులు ఘర్షణల నివారణోపాయాన్ని ప్రబోధించగలగాలి. ఆశాకిరణంగా (అంధకారంలో) మెరుస్తున్న భారత న్యా యవ్యవస్థ దూరదృష్టితో వ్యవహరించాలి. పార్లమెంటు పరిధిలో పనిచేసినా అన్నిటికీ అతీతమైన, నిర్దుష్టమైన, న్యాయబద్ధమైన భారత జనసంక్షేమం దృష్టి లో ఉంచుకొని అక్రమాల కొడిగట్టే ప్రయత్నాన్ని కట్టడి చేయడంలో చొరవ ప్రదర్శించాలి. అత్యంత శక్తివంతమైన ప్రజ ల అభీష్టం ఎన్నికల్లో తప్ప మిగ తా సమయాల్లో కనిపించదు. ప్రజా ఉద్యమాల రూపంలో చట్టసభల్ని ప్రభావితం చేసేంత జన చైతన్యం ఇంకా మన దేశం లో పరిపక్వదశకు రాలేదు.
ప్రస్తుత ఘర్షణాత్మక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సంక్షోభంలో దేశం ఒక దయనీయ స్థితిలోకి నెట్టివేయబడుతున్నది. నిద్రాణమైన జాగృతి ఎవర్నో ఒకర్ని మేల్కొల్పి ఒక సమగ్ర అవగాహన ప్రణాళికా నేతృత్వంలో దేశం ఒక పెను మార్పుకై ఊహించడం మంచిదే. ఆ ఊహకు ఒక రూపం కల్పించే దిశలో ప్రయత్నించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఎవరో ఒకరు సాహసోపేతమైన నిర్ణయాన్ని జనావళి ముందు ఉంచాలి.
జాతి సంక్షేమమే పునాదిగా నడుం బిగించి రంగప్రవేశం చేసి రాజకీయ ప్రక్షాళనతో ముం దుకు సాగాలి. తద్వారా ఆరంభింపరు నీచ మానవులు అనే (భర్తృహరినీతి) బలహీన మానసిక దుస్థితిని అధిగమించాలి. ఉరకలేసే ఉత్సాహంతో విమర్శల సుడిగుండాలని తృణీకరిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయం ఆహ్వానించదగింది. విశ్వవ్యాప్త సం ఘటనల్లో సుపరిపాలనా వేదాంతం సామూహిక శక్తుల పరంగా కాకుండా ఒక వ్యక్తి మేధస్సులో జనించి సంస్కరణలకు పురుడు పోసుకున్న దృష్టాంతాలే అధికం. ఏదీ ఎక్కడి నుం చో ఆకాశాన్నుంచి ఊడి పడదు. జనించే ఆలోచనాధారలే ఉద్యమాలకు, జీవన వేదాంతాలకు మూ లము. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తలపోసి, తపిస్తు న్న ఆరాట పరిధి విస్తృతమై దేశ సంక్షేమ పథంలో విప్లవాత్మక మార్పులకు ఒక నాందీ ప్రస్థావన. ముఖ్య మంత్రి కేసీఆర్ నేతృత్వం లో భారతరాష్ట్రసమితి భావి తరాలకు భరోసా నిస్తుంద ని ఆశిద్దాం
ఉరకలేసే ఉత్సాహంతో విమర్శల సుడిగుండాలని తృణీకరిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయం ఆహ్వానించదగింది. విశ్వవ్యాప్త సం ఘటనల్లో సుపరిపాలనా వేదాంతం సామూహిక శక్తుల పరంగా కాకుండా ఒక వ్యక్తి మేధస్సులో జనించి సంస్కరణలకు పురుడు పోసుకున్న దృష్టాంతాలే అధికం.
కె. లక్ష్మణ్ గౌడ్: 9704930509