కొడంగల్, జనవరి 16: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో తండాలు అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నాయి. తండాల అభ్యున్నతికి ప్రత్యేకంగా చర్యలు తీసుకొని గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడంతో పనులు జోరుగా సాగుతున్నాయి. పల్లె ప్రగతితో తండాలోని ప్రతి వీధి స్వచ్ఛత, సీసీ రోడ్డులతో కళకళాడు తున్నాయి. గ్రామాలకు తీసిపోనట్లుగా తండాలు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నా యి. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రత్యేక చొరవతో కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి, తండాలకు బీటీ రోడ్డు ఏర్పాటు అవుతుండటంతో ప్రజలు సంతోషాన్ని వ్య క్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి అంటే ఏమిటో కండ్ల ముందు కనిపిస్తుందని ఆనందాన్ని వ్యక్త చేస్తున్నారు. మండల పరిధిలోని పోచమ్మ తండా, మైసమ్మతండా కలిసి నూతనంగా పోచమ్మతండా గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ప్రస్తుతం రెండు తండాల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు.
కొడంగల్ పట్టణం నుంచి పోచమ్మతండా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తండావాసులు ప్రతి చిన్న పనికి కొడంగల్ పట్టణానికి రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం పోచమ్మతండా వరకు బీటీ రోడ్డు నిర్మాణం పూర్తై తండా వరకు రవాణా సౌకర్యం మెరుగుపడింది. పోచమ్మ తండా నుంచి మైసమ్మతండాకు దారి మధ్యలో వాగు ఉండటం వల్ల వర్షాకాలం మైస మ్మతండా వాసులు ఎక్కడి వారు అక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితి. రూ.50లక్షలతో బ్రిడ్జి నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. బ్రిడ్జి నుంచి తండాకు చేరుకోవడానికి మళ్లీ రూ.కోటీ 50 లక్షలతో బీటీ రోడ్డు మంజూరు అయింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామని తండావాసులు పేర్కొంటున్నారు. బ్రిడ్జితో పాటు బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఏండ్లనాటి కల తీరుతుందన్నారు.
మైసమ్మతండాకు బ్రిడ్జి నిర్మాణంతో పాటు బీటీ రోడ్డు మంజూరు కావడంతో మా కష్టాలు తీరనున్నాయి. గతంలో ఎంతో మంది నాయకులు, అధికారులకు రోడ్డు సౌకర్యం కల్పిం చాలని కోరాం. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి గిరిజనుల కష్టాలను గుర్తించి, బ్రిడ్జితో పాటు బీటీ రోడ్డును మంజూరు చేయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు ఎప్పటికీ రుణపడి ఉంటాం -గోపాల్ నాయక్, మైసమ్మతండా, కొడంగల్
కొడంగల్ అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులను మం జూరు చేయించారు. అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తు న్నారు. రూ.50లక్షలతో బ్రిడ్జి నిర్మాణ పనులు జోరుగా కొన సాగుతున్నాయి. బ్రిడ్జి నుంచి తండాకు చేరుకోవడానికి కూడా బీటీ రోడ్డు మంజూరు కావడం సంతోషంగా ఉంది.
– శంకర్నాయక్, సర్పంచ్, పోచమ్మతండా, కొడంగల్