దేశ ప్రజలకు స్వేచ్ఛా ఫలాలు కల్పించడానికి తనను తానే అర్పణ చేసుకున్న గొప్ప త్యాగధనుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. అలాంటి మహనీయుని అశయాలకు అనుగుణంగా ఉద్యమ రథసారధి ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు సుభిక్షమైన పాలననందిస్తూ అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నారు. ఆర్థికంగా భరోసానిచ్చే పథకాలను ప్రవేశపెడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషిచేస్తున్నారు.
స్వా తంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా దళితుల జీవితాల్లో మాత్రం మార్పు లేదు. వారిలో వెనుకబాటు పూర్తిగా తొలగిపోవాలని దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ప్రతిష్ఠాత్మక దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్. ఒక్కో కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయంతో వివిధ వ్యాపార యూనిట్లు అందిస్తున్నారు. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితబంధుకు 7 వేల కోట్ల కు పైగా నిధులు కేటాయించారు. అలాగే ఎస్సీల అభివృద్ధ్ది కోసం దాదాపు 20 వేల కోట్ల బడ్జెట్ను కేటాయించింది. తద్వారా దళితులను సమాజంలో అగ్రభాగాన నిలిపే చర్యలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం నిజంగా గర్వించదగిన విషయం.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ దవాఖానాల్లో వివిధ సరఫరాలకు సంబంధించిన కాంట్రాక్టుల్లో వారికి 16 శాతం కేటాయించింది. ఇది మరో చారిత్రాత్మక నిర్ణయం. తద్వారా పారిశుధ్యం, సెక్యూరిటీ, పోషకాహారం సరఫరాల్లో వారికి భాగస్వా మ్యం లభించినట్లయింది.
కాంట్రాక్టు ఉద్యోగమైతే చాలనుకునే దళితునికి.. కాంట్రాక్టర్గా అవకాశం కల్పించడం, ట్రాక్టర్, కారు డ్రైవర్లుగా జీతానికి పని చేసుకునే వారిని యజమానులుగా చేయడం తెలంగాణలో మాత్రమే సాధ్యమైంది. ఉన్నత విద్యావకాశాలకు దూరంగా ఉన్న దళితులకు విదేశీ విద్యా నిధి పథకం కింద రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేయడం గొప్ప విఫయం. అంబేద్కర్ కలలుగన్న ఆర్థిక స్వేచ్ఛ, విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయరంగాల్లో దళితులకు ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రమే సముచిత స్థానం, అవకాశాలు కల్పిస్తూ వారి బతుకుల్లో వెలుగులు పూయిస్తున్నది.
తాజాగా హుస్సేన్సాగర్ తీరాన అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటుచేయడం దళితుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. విశ్వనగరంలో కొలువుదీరిన అంబేద్కర్ మహాశిఖరం.. ఓ అద్భుతం. పరిపాలనకు, సమాజ సేవకు, త్యాగానికి, ప్రజాస్వామ్యానికి గుర్తుగా ఆయన సజీవ సాక్ష్యంలా హైదరాబాద్ నడిబొడ్డున నిలబడినట్లుంది. మరోవైపు.. ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయ భవనానికి అంబేద్కర్ సచివాలయంగా పేరు పెట్టింది. ఒకప్పుడు అమెరికా ఆక్స్ఫర్డ్, లండన్ యూనివర్సిటీలలో జ్ఞానయోధునిగా ఆయన విగ్రహాలు నెలకొల్పారు. అటువంటి ది నేడు మన తెలంగాణ రాష్ట్రం లో ఆకాశమంతా ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టడం గొప్ప విషయం. భవిష్యత్ తరాలు సైతం మరిచిపోలేని రీతిలో సీఎం కేసీఆర్ నేతృత్వం లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దళితుల్లో వెలుగులు నింపుతున్నాయి.
– సంపత్ గడ్డం
78933 03516