ఓ తెలంగాణోడా నీకే చెప్పేది.. విను! నీకు తెలవకుండానే, నిన్ను మల్ల బానిసని చేస్తున్నది ఈ రాజ్యం. ఈ రాజ్యం నువ్వు అనుకున్న ఇందిరమ్మ రాజ్యం కాదు, కమ్మనైన పచ్చ రాజ్యం. తెలుగుదేశపోడు నడిపిస్తున్న రాక్షస రాజ్యమే. బెల్లి లలితక్కని బలి తీసుకున్న బాబు నడిపిస్తున్న రాజ్యమే. మందిమాటలను పట్టుకొని పచ్చగున్న తెలంగాణని మల్లా ఆంధ్రా పెత్తందార్ల చేతుల్లో పెట్టే దుస్థితి వచ్చింది.
ఓ తెలంగాణోడా నీకు తెలుసా? ‘కత్తి ఆంధ్రోడిదే కానీ, పొడిచేది మాత్రం తెలంగాణోడ’ని ఉత్తగ చెప్పలే కేసీఆర్ నాడు. మన నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని ఇక వాడు చెప్పినట్టే నడుస్తాయి. మంది మాటలు నమ్మి మారువానం పోతే ఉన్న ఇల్లు కాలిందట. గట్ల మంది మాటలు నమ్మి దొంగ మీడియాగాళ్ల సోషల్ మీడియా ఫేక్ న్యూస్లను నమ్మి తినే పళ్లెంలో మన్నువోసుకున్న ఓ తెలంగాణోడా మల్ల బానిస బతుకు బతకడానికి సిద్ధమైపో. ఓ రైతన్నా.. ధైర్యంగా మల్లా కొట్లాటకు నాగలి పట్టుకొని తయారై ఉండు. లేకుంటే మనకు ఉరితాడే శరణ్యం.
ఓ నేతన్న నీ సాలె మగ్గంని పక్కకు పెట్టకు, మంది మాటలు నమ్మి మోసపోయింది చాలు. తెగించి కొట్లాడు ఇకనైనా.. ఓ బేస్త, ముదిరాజ్ సోదరులారా.. మీ చేపలు ఇక అమ్ముడుపోనీయకుండా ‘ఆంధ్రా పిత్తబర్గెలే ముద్దు’ అంటే నీ వలనే వారికి ఉరిగా మలుచు. ఆంధ్రావోడు మన వనరులు, సంపద మీద రాజ్యమేలడానికి తెలంగాణోడే సాయం చేసుడు షురూ జేసిండు. ఎవడు మనోడు, ఎవడు పరాయోడో తెలువక గాయి గత్తర అయితిరి, మాటలు నమ్మితిరి. మనం గోసలు పడటానికి మన కత్తితో మన కంట్లనే పొడుసుకునేలా చేసిండ్రు.
ఓ తెలంగాణోడా ఇకనైనా అర్థమైందా? కాకపోతే మనల్ని మన ముందు తరాలు క్షమించవు. వద్దన్న బానిస బతుకులను మల్లా తెచ్చుకున్న తెలంగాణోడా విను.. ఇంటొడు మనోడు కాకపొతే పడే అవస్థలు అన్నీఇన్నీ కావే రాములా.. చివరగా కాళోజీయాదిలో ఒక మాట.. ‘తెలంగాణని నాడు మోసం చేసింది పరాయోడే.. నేడు, రేపు మోసం చేసేది పరాయోడే. మన తెలంగాణోడి చేతిలో కత్తి పెట్టి మనల్నే పొడిపిస్తరు. అందుకే, ప్రాంతేతరులకు వత్తాసు పలుకుతున్నవారిని మన తెలంగాణ పొలిమేరల దాకా తరిమికొడుదాం. మనల్ని మోసం చేస్తున్న మన ప్రాంతంవాడిని ఇక్కడే పాతరవేద్దాం. మన భావితరాలకు ప్రశాంత జీవితాల కోసం పాటుపడదాం. ప్రజా ఉద్యమం చేసి పెత్తందార్ల లెక్క చేసే నాయకుల పొగరు అణచుదాం. మేలుకో తెలంగాణోడా.. ఇకనైనా మేలుకో.
– సల్వాజి మాధవరావ్ 93916 73807