ఎన్నో ఆకాంక్షలతో, ఆశయాలతో ఉద్యమించి స్వరాష్ట్రం సాధించుకున్నాం. గడిచిన పదేండ్ల పాలనలో సంక్షేమ తెలంగాణ సాకారమైంది. సబ్బండ వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగుతున్నది. అనేక రంగాల్లో ముందుకుపోతున్న తెలంగాణ ఒక సమ్మిళిత అభివృద్ధితో రైతాంగాన్ని, సంక్షేమాన్నే కాకుండా పారిశ్రామిక విధానంలో లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది.
దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా తెలంగాణ సమగ్ర జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా విశేష కార్యక్రమాలు చేపట్టింది ప్రభుత్వం. గతంలో రాష్ట్రం ఏర్పడితే నష్టపోతామని అవహేళన చేసిన దశ నుంచి దేశంలో అత్యధిక సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్రంగా నేడు అభివృద్ధిలో దేశానికే మాడల్గా నిలిచింది తెలంగాణ. సర్వతోముఖాభివృద్ధి కోసం సంపద పెంచాలి, పెరిగిన సంపదను అవసరమైన ప్రజలకు పంచాలన్న ధ్యేయంతో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండాలని, మానవీయ కోణంలో పథకాలను రూపొందించి అమలు చేస్తున్నది ప్రభుత్వం. రాష్ట్రంలో నేడు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందని కుటుంబమంటూ లేదంటే అతిశయోక్తి కాదు. సకలజనులకూ సంక్షేమ ఫలాలు అందిస్తున్నది. అవసరమైన అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ, సంక్షేమమే లక్ష్యంగా ముందుకుపోతున్న ఒకేఒక్క రాష్ట్రం తెలంగాణ.
సాగునీటి వనరుల పెరుగుదలతో వ్యవసాయ రంగంలో ఊహించని స్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతోంది. మరోవంక తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. నిరంత రం శ్రమించి రాష్ట్రంలోని అన్ని రంగాలనూ బలోపేతం చేయడంతో పాటు, అభివృద్ధి అంటే ఏమిటో అనతికాలంలోనే దేశానికి చాటిచెప్పగలిగాం.
పరిపాలనను వికేంద్రీకరించి ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం పాలనా సంస్కరణలు చేపట్టింది ప్రభుత్వం. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసిం ది. అన్ని జిల్లాలలో సకల సౌకర్యాలతో సమీకృత కలెక్టరేట్లు నిర్మించింది. గిరిజనుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ తండాలకు, గూడెలకు గ్రామపంచాయతీ హో దా కల్పించింది. ఇంటింటికీ ఫలాలు చేరుతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు వినూత్న పథకాల అమలు తీరు గొప్పగా ఉన్నది.
అడగకుండానే సీఎం కేసీఆర్ ఎన్న్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. రైతు బీమానే కాదు, నేతన్న బీమా తో పింఛన్ తీసుకుంటున్న వాళ్ళు చనిపోతే, వారి సం బంధీకులకు ఆ పింఛన్ వెంటనే బదిలీ చేయడం ముఖ్యమంత్రి మానవీయ కోణానికి అద్దం పడుతుంది. బీసీ బంధు కింద చేసే ఆర్థిక సహాయం గ్రాంట్ మాత్ర మే, మళ్ళీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ తరహాలో పథకాలు దేశంలో ఎక్కడా లేవు.
ఇల్లు కట్టడం, పెండ్లి చెయ్యడం. ఒకప్పుడు ఏ పేద కుటుంబానికైనా ఈ రెండూ పెద్ద పెను సవాళ్లుగా ఉండేవి. బిడ్డ పెండ్లి చేసిన తర్వాత పురుళ్లు మరో పెద్ద బాధ్యత. ఇక పిల్లల చదువు. చదువుకు తగిన ఉపాధికి నిత్యం ఏదో ఒక సమరమే. దానికి తోడు ఇంట్లో ఉన్న వృద్ధుల బాధ్యత. ఇంటిల్లిపాది పోషణ. అరకొర ఆదాయాలతో బతుకీడ్చలేక దుబాయ్కో, బొంబాయికో వలసపోయేది. ఉమ్మడి పాలనలో ఇదే గోస! తెలంగాణ జీవన దృశ్యాన్ని చూస్తేనే బతుకు భారంగా ఉండేది. ఒకప్పుడు సంక్షోభంలో కూరుకొని అల్లాడిన తెలంగాణ వ్యవసాయానికి తిరిగి జవజీవాలను అందించడంలోనూ, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడే రైతుల్లో తిరిగి ధైర్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలోనూ ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైంది. ప్రభుత్వం చేసిన అసాధారణ కృషితో నాడు కరువుకాటకాలతో అలమటించిన తెలంగాణ నేడు సుజల, సుఫల, సస్యశ్యామల తెలంగాణగా అవతరించింది. నేడు దేశానికే ఆదర్శం తెలంగాణ.
ఒకనాడు చుక్క నీటికోసం అలమటించిన తెలంగాణ ఇపుడు ఇరవైకి పైగా రిజర్వాయర్లతో పూర్ణకలశం వలె తొణికిసలాడుతున్నది. మూడు కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడితో నేడు తెలంగాణ దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతున్నది. సంక్షేమంలో, అభివృద్ధిలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తున్నది. దశాబ్దకాలంలో తెలంగాణ సాధించిన అపూర్వ ప్రగతిని చూసి యావద్దేశం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నది.
సొంత రాష్ట్రంగా తెలంగాణలో సబ్బండ వర్ణాల సమగ్ర జీవన ప్రమాణాలు పెంచేందుకు సీఎం కేసీఆర్ సంక్షేమయజ్ఞం చేస్తున్నారు. ఒకటా.. రెండా.. అనేక పథకాలు.. ఒక పేద కుటుంబం సమగ్రంగా మెరుగైన జీవితం గడిపేందుకు భరోసానిస్తున్నారు!! సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో అత్యంత పేదరికంలో ఉన్న జీవితాల్లో వెలుగులు పూస్తున్నాయి!
స్వతంత్ర భారతదేశంలో దళితజాతి నేటికీ అంతులేని వివక్షకు గురవుతూనే ఉన్నది.ఆర్థికంగా వెనుకబాటు తనంతో పాటు, సాంఘిక వివక్షకు గురైన బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించింది. అణగారిన దళితజాతి సమగ్ర అభ్యుదయం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు విప్లవాత్మక పథకం దళితుల్లో సమగ్రమార్పును తీసుకువస్తున్నది.
అనతికాలంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్వన్ సంక్షేమరాజ్యంగా తీర్చిదిద్దారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందించాలన్న లక్ష్యంతో వినూత్న పద్ధతుల్లో సంక్షేమ పథకాలను రూపొందించి విస్త్రృతస్థాయిలో అమలుచేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు దాదాపు కోటిన్నర మందికి చేరుతున్నాయి.
ఒకనాడు కరెంట్ కోతలతో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ ప్రభుత్వం చేసిన అవిరళ కృషితో నేడు ఇరవై నాలుగు గంటల విద్యుత్తుతో వెలుగు జిలుగుల రాష్ట్రంగా విరాజిల్లుతున్నది. వ్యవసాయం కుదేలైపోయి విలవిలలాడిన నేల.. నేడు దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అవతరించింది. తాగునీటి కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడి, తెలంగాణ వందశాతం గ్రామాల్లో ఇంటింటికీ ఉచితంగా నల్లాల ద్వారా స్వచ్ఛమైన సురక్షిత జలాలను సరఫరా చేస్తున్నది. ఒకనాడు పాడుబడినట్టున్న తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారి, నేడు అత్యున్నత జీవన ప్రమాణాలతో ఆదర్శవంతంగా తయారయ్యాయి. పెట్టుబడులకు స్వర్గధామంగా, ప్రపంచస్థాయి సంస్థలకు గమ్యస్థానంగా, ఐటీరంగంలో మేటి రాష్ట్రంగా తెలంగాణ ప్రగతిపథంలో పరుగులు పెడుతున్నది. పారిశ్రామిక విప్లవం వచ్చింది.
ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రతి గ్రామీణ, పట్టణ నిరుపేదలకు లబ్ధి చేకూర్చేవిధంగా జరుగుతున్న ప్రయత్నాలకు జాతీయస్థాయి లో ప్రశంసలు అందుతున్నాయి, రాష్ట్రంలోని దళిత, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ వర్గాల ప్రజలందరికీ సంక్షేమఫలాలు అందుతున్నాయి. ప్రజల జీవనప్రమాణాలు పెరుగుతున్నాయి. వృద్ధులు, వితంతువు లు, వికలాంగులు గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లి ఒకనాడు భారమై తే నేడు వేడుకగా మారింది.
ఆసరా పింఛన్లు మొక్కుబడిగా కాకుండా, కనీస అవసరాలకు సరిపోయేలా ఉండాలన్నదే ప్రభుత్వ అభిప్రాయం. అందుకే, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచిం ది. గతంలో కేవలం రూ.200గా ఉన్న పింఛన్ మొత్తా న్ని రూ. 2,016 లకు. దివ్యాంగులుకు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని ఇటీవలే రూ.3016 నుంచి రూ.4,016లకు పెంచుకు న్నాం. దశలవారీగా ఆసరా పింఛ ను మొదటి సంవత్సరంలో రూ. 3,016.. దశల వారీగా ఐదేళ్లలో రూ. 5,016 వరకు పెంపు. ఇది నిస్సహాయులు ఆత్మగౌరవంతో బతకడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న భరోసా.
2014 నాటికి పింఛను తీసుకు నే వారి సంఖ్య 29 లక్షలు మాత్ర మే ఉండగా, ఇవాళ 44 లక్షల మందికి పింఛన్లు ఇచ్చుకుంటున్నం. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతోపాటు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, బీడీ కార్మికులు తదితర అన్నివర్గాలవారికి కూడా ప్రభుత్వం పింఛను సౌకర్యం కల్పించింది. వృద్ధులకు పింఛను వయో పరిమితిని 60 నుంచి 57 ఏండ్లకు తగ్గించింది.
అపూర్వమైన, అద్భుతమైన ఈ పరివర్తనకు ముఖ్యమంత్రి కేసీఆరే కర్త, కర్మ, క్రియగా నిలిచారు. అందుకే రాష్ట్రంలోని కర్షక సోదరులు వారిని రైతు బాంధవుడిగా భావిస్తున్నారు. నిండు హృదయంతో ఆశీర్వదిస్తున్నా రు. నేడు తెలంగాణ జీవన దృశ్యాన్ని చూస్తే.. నిరంతర విద్యుత్తు ప్రసారంతో వెలుగులు వెదజల్లుతున్నది. పంట కాల్వలతో, పచ్చని చేన్లతో కళకళలాడుతున్నది. మండే ఎండలలో సైతం చెరువులు మత్తడి దుంకుతున్నయి. వాగులు, వంకలు, వాటిపై నిర్మించిన చెక్ డ్యా ములు నీటి గలగలలతో తొణికిసలాడుతున్నాయి.
తరలివస్తున్న కాళేశ్వర జలధారలు తెలంగాణ భూ ములను తడుపుతున్నాయి. సంక్షేమం, అభివృద్ధి జోడుగుర్రాలుగా ప్రభుత్వం ప్రగతి పథంలో వేగంగా పయనిస్తున్నది. పదేండ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నది. తెలంగాణ అభివృద్ధి మాడల్ గురించిన చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక పవిత్రయజ్ఞంగా నిర్వహించింది. నిజాయితీతో, నిబద్ధతతో, నిరంతర మేధోమధనంతో అవిశ్రాంతంగా శ్రమించింది. విధ్వంసమైపోయిన తెలంగాణను విజయవంతంగా వికాసపథం వైపు నడిపించింది.
– తీగల అశోక్ కుమార్ 79891 14086